శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :
శ్రీ అమ్మవారి దర్శనార్థం ఈరోజు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమల రావు, IPS దంపతులు ఆలయమునకు విచ్చేయగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించిన అదనపు కమీషనర్ మరియు ఆలయ ఈవో కే. రామచంద్ర మోహన్ ..
అనంతరం ఆలయ వేదపండితులుచే వీరికి వేదాశీర్వచనం కల్పించగా, ఆలయ ఈవో శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు.
అనంతరం వీరు సంక్రాంతి సందర్బంగా దేవస్థానం నందు ఏర్పాటు చేసియున్న బొమ్మల కొలువు, తదితర కళాకృతులను తిలకించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో తో పాటుగా డిప్యూటీ ఈవో ఎం. రత్నరాజు ఉన్నారు.