Home Political news శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం నియోజకవర్గం, ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించిన సీఎం.

శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం నియోజకవర్గం, ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించిన సీఎం.

3
0

 శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం నియోజకవర్గం, ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించిన సీఎం.

 జెండా ఊపి గ్యాస్ పంపిణీ చేసే వాహనాలను ప్రారంభించిన సీఎం. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గ్యాస్ సిలిండర్ అందజేసిన సీఎం. లబ్ధిదారు శాంతమ్మ నివాసంలో గ్యాస్ వెలిగించి స్వయంగా టీ పెట్టిన సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఆహార &  పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ 

మంత్రి నాదెండ్ల మనోహర్ 

మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ

అక్టోబర్ నెల 29 నుంచి  ఉచిత గ్యాస్ సిలెండర్లకు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి

మొదటిరోజు నాలుగు లక్షల ఇరవై వేల మంది ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారు..

అర్హులైన వారందరికీ  దీపావళి నుండి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు

ఏపీలో సూపర్ సిక్స్ హామీ నిలబెట్టుకుంటున్న కూటమి సర్కార్ 

దీపావళి నాడు ఇళ్లలో అసలైన దీప కాంతులు నింపబోతున్న కూటమి ప్రభుత్వం

దీపం -2 పధకం క్రింద అర్హులైన కుటుంబాలు వారు తమ మొదటి సిలిండర్ పొందడం కోసం అక్టోబర్ 29 వ తేదీ నుంచి 31 మార్చి 2025 వరకూ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.

ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో

బుక్ చేసిన 24 గంటల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ ఇస్తారు.ఆ తర్వాత సిలెండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు  చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ చేస్తారు.  

ఒక సంవత్సరంలో  3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తారు. అయితే  వీటిని ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తారు.

ఈ దీపావళి తో ప్రారంభమయ్య పథకం పాటు ప్రతి ఏడాది

ఏప్రిల్  – జూలై (01), 

ఆగష్టు –నవంబర్ (01), 

డిసెంబర్ –మార్చి (01)  

మధ్య మూడో సిలెండర్ బుక్ చేసుకోవచ్చు. 

ఇలా ఉచిత సిలెండర్ కోసం బుక్ చేసుకున్న దీపం -2 లబ్దిదారులకు ఆయిల్ కంపెనీల నుంచి ఇలా మెసేజ్ వస్తుంది. 

“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దీపావళి నుండి అందిస్తున్న దీపం -2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా మొదటి సిలిండర్ కోసం నమోదు చేసుకొన్నందుకు శుభాకాంక్షలు. లబ్దిదారులు సిలిండర్ కై ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. ఈ చెల్లించిన  అమౌంట్, మీరు సిలిండర్ డెలివరీ తీసుకున్న 48 గంటలలో మీ బ్యాంకు ఖాతా నందు జమ చేయబడుతుందని తెలియచేస్తున్నాము.”

ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు

1)ఎల్.పి.జి.కనెక్షన్ కలిగి ఉండటం

2) రైస్ కార్డ్,

3) ఆథార్ కార్డు 

4). ఆధార్ కార్డుతో రైస్ కార్డుతో అనుసంధానం అయి ఉండాలి

ఎటువంటి సమాచారం లోపం ఉన్న టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు

( అక్టోబర్ 29 మొదటి రోజు టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసిన 9,000 మంది తమ సందేహాన్ని గుర్తు చేసుకున్నారు)

*దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం*

*మొదటి విడతకు అయ్యే ఖర్చు రూ.894 కోట్ల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు అందజేసిన సిఎం చంద్రబాబు*   పౌర సరఫరాలు,  శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 

•ఈ పథకం అమలుకై ప్రతి ఏడాది రూ.2,684.75 కోట్ల మేర ప్రభుత్వం పై భారం

*•అయిల్ కంపెనీలకు అడ్వాన్సుగా రూ.894.92 కోట్లను 29 న చెక్కు రూపేణా చెల్లింపు*

 రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, 1.47 రేషన్ కార్డులు ఉన్నాయని, వీరిలో అర్హులు అందరికీ ఈ పథకం వర్తింప చేయడం జరుగుతుందన్నారు. 

ఈ పథకం అమలుకై ప్రతి ఏడాది  ప్రభుత్వం పై రూ.2,684.75 కోట్ల మేర భారం పడుతుందన్నారు.

 ఎన్నో ఆర్థిక ఇబ్బందులను  రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కుంటున్నా సరే  ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మహిళల  భద్రతను దృష్టిలో ఉంచుకుని  కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.  

  ఈ పథకం అమలుకు సంబందించి ఇప్పటికే మూడు ఆయిల్ కంపెనీలతో మాట్లాడం జరిగిందని, ఆయిల్ కంపెనీల వద్ద మరియు ప్రభుత్వం వద్ద ఉన్న డాటాను అనుసంధాపరుస్తూ ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. 

                                                                                                                                                            రాష్ట్రంలో ఉన్న 1.55  గ్యాస్ కనెక్షన్లలో కేవలం 9.65 లక్షల గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే ప్రధాన మంత్రి ఉజ్వల యోజనా పథకం వర్తింపు అవుతున్నదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here