Home Political news శానస మండలి సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన పిడుగు హరిప్రసాద్

శానస మండలి సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన పిడుగు హరిప్రసాద్

2
0

 శానస మండలి సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన పిడుగు హరిప్రసాద్

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన జనసేన అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శ్రీ పిడుగు హరిప్రసాద్ సోమవారం ఉదయం మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం పూర్తయిన అనంతరం శాసన మండలి ఛైర్మన్ మోషెన్ రాజు హరిప్రసాద్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం మండలి చైర్మన్ ఛాంబర్ లో నిర్వహించారు. పిడుగు హరిప్రసాద్ అనే నేను శాసన మండలి సభ్యునిగా ఎన్నికయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధేయుడిగా ఉంటూ విధులు నిర్వర్తిస్తానని దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం శాసన మండలి ఛైర్మన్ తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో హరిప్రసాద్ కుటుంబ సభ్యులు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, పార్టీ నాయకులు చిల్లపల్లి శ్రీనివాస్, అమ్మిశెట్టి వాసు, శ్రీ మండలి రాజేష్, వై.శ్రీనివాస్, చోడిశెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

• భారీ ర్యాలీగా శాసన మండలికి..

అంతకు ముందు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా హరిప్రసాద్ ఇంటి వద్ద నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వరకు, అక్కడి నుంచి శాసన మండలి వరకు భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చి సంబరాలు చేశారు. దారిపొడుగునా పార్టీ శ్రేణులు పూల వర్షం కురిపించారు. ఉదయం 8. 30 నిమిషాలకు ఇంటి వద్ద నుంచి బయలుదేరిన హరిప్రసాద్ పార్టీ కార్యాలయం వద్ద ఆగి పార్టీ జెండాకు నమస్కరించారు. అనంతరం కార్యాలయంలోని తన గది నుంచి శాసన మండలికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు హరిప్రసాద్ కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వేగుళ్ల లీలాకృష్ణ, బండి రామకృష్ణ, మేడిశెట్టి సూర్య కిరణ్, శ్రీ అతికారి క్రిష్ణ, దాసరి సత్యనారాయణ, తాడిశెట్టి నరేష్, బర్మా ఫణిబాబు, గరికిపాటి శివశంకర్, బొలియాశెట్టి శ్రీకాంత్, నల్లగోపుల చలపతి,  సందు పవన్, రావాడ నాగు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here