Home Crime News శబరి సన్నిధానంలో అయ్యప్ప భక్తుడి ఆత్మహత్య?

శబరి సన్నిధానంలో అయ్యప్ప భక్తుడి ఆత్మహత్య?

3
0

 శబరి సన్నిధానంలో అయ్యప్ప భక్తుడి ఆత్మహత్య?

ఈ సీజన్‌లో అయ్యప్ప భక్తులతో కిటకిటలాడు తోన్న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సన్నిధానం వద్ద ఓ భక్తుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

సోమవారం రాత్రి నెయ్యాభిషేకం టిక్కెట్ కౌంటర్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ పై నుంచి దూకి భక్తుడు మృతి చెందాడు. అతడ్ని కర్ణాటకకు చెందిన కుమార  స్వామి (40)గా గుర్తిం చారు. ఫ్లైఓవర్‌పై నుంచి దూకడంతో కుమార  స్వామి కి కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. 

దీంతో అతడికి సన్నిధానం వద్ద ఉన్న ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కొట్టయాం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలి స్తుండగా మార్గంమధ్యలో కుమారస్వామి మృతిచెంది నట్టు అధికారులు తెలిపారు. 

తీవ్రగాయాలు కావడంతో గుండెపోటుకు గురైనట్టు చెప్పారు. అయితే, కుమారస్వామి మానసిక సమస్యతో బాధపడుతు న్నట్టు అతడి వెంట వచ్చిన ఇతర భక్తులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here