Home Political news శనివారం ఎన్టీఆర్‌ భవన్‌కు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రివర్యులు మాన్య నారా చంద్రబాబు...

శనివారం ఎన్టీఆర్‌ భవన్‌కు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రివర్యులు మాన్య నారా చంద్రబాబు నాయుడు విచ్చేశారు.

3
0

 *హైదరాబాద్*

*తేది:* 10-08-2024

శనివారం ఎన్టీఆర్‌ భవన్‌కు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రివర్యులు మాన్య నారా చంద్రబాబు నాయుడు విచ్చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం జరిపారు.

ఈ కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా సభ్యత్వ నమోదు, కింది స్థాయి నుంచి నాయకత్వాన్ని తయారు చేయడం తదితర అంశాలపై చర్చించారు. పార్టీ బలోపేతంపై నాయకుల నుంచి సూచనలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

*ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…*

2023లో ప్రత్యేక రాజకీయ పరిస్థితుల వల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ విధానాన్ని పార్లమెంట్‌ ఎన్నికలలోనూ ఇక్కడ కంటిన్యూ చేయడం జరిగింది. ఇక్కడి మెజారిటీ ప్రజలు, పార్టీ అభిమానులు ఏపీకి వచ్చి అక్కడి ఎన్నికలలో పని చేయడం జరిగింది. భారీ మెజారిటీతో ఏపీలో పార్టీ గెలవడం జరిగింది. అక్కడికి వచ్చి పార్టీ కొరకు పని చేసిన వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. 2014 ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ అలయన్స్‌తో కలిసి 20 సీట్లు గెలిచాం. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 22 శాతం ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల తరువాత 5 సంవత్సరాలు ఏపీలో పార్టీ ఎప్పుడూ పడని ఇబ్బందులను పడటం జరిగింది. స్టెప్‌ బై స్టెప్‌ పోరాటం చేసి ముందుకెళ్లడం వల్ల ఎవరూ ఊహించని ఫలితాలు గత ఏపీ ఎన్నికలలో ఫలితాలు రావడం జరిగింది. 

పబ్లిక్‌ పాలసీ అనేది ప్రజల జీవితాలలో ముఖ్యమైన పాత్రను వహిస్తాయి. పారదర్శకతతో పబ్లిక్‌ పాలసీలను తీసుకొచ్చి హైటెక్‌ సిటీ వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం వల్ల హైదరాబాద్‌ ను అభివృద్ది చేశాం. 

2024 ఎన్నికలలో ఏపీలో వచ్చిన మెజారిటీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంత వరకు ఎప్పుడూ రాలేదు. 1982 లో వేవ్‌ వచ్చింది 1994లో విప్లవం వచ్చింది. 1982లో పార్టీ పెట్టి ఎన్‌టి. రామారావు గారు రాష్ట్రమంతటా ఉధృతంగా తిరిగి ప్రచారం చేసి 9 నెలలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చరిత్రసృష్టించారు. 1994లో అప్పటి కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. అది ఒక చరిత్ర. 2024 ఏపీ ఎన్నికలలో ప్రతిపక్షానికి 11 సీట్లే ప్రజలు ఇచ్చారు. మనకు 95 వేలు, 80 వేలు, 70 వేలు వంటి భారీ మెజారిటీలతో గెలిపించారు. ఇది తెలుగుదేశం పార్టీకి, మనకు వినూత్న అనుభవం. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా క్షేత్రస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పోరాటాలు చేయడం వల్ల ఈ ఫలితాలు వచ్చాయి. 

తెలుగుజాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్‌లో ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎన్‌టిఆర్‌ పార్టీని ప్రారంభించారు. చాలా కాలం ఇక్కడి నుంచే పని చేశాం. హైదరాబాద్‌లో మనం చేసిన అభివృద్ధి ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రానికి ఆయువుపట్టుగా మారింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఉంది. దీనికి ప్రధాన కారణం మనం చేసిన ఎకో సిస్టమే. ఈ ఎకో వ్యవస్థను తరువాత 5 మంది ముఖ్యమంత్రులు ముందుకు తీసుకెళ్లారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఇంప్రూవ్డ్‌ హైదరాబాద్‌ సిస్టమ్‌ను ఏపీలో తీసుకొచ్చి 5 సంవత్సరాలు కష్టపడ్డాం. కానీ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని, పోలవారాన్ని నాశనం చేసింది. దీని వల్ల ఏపీలో ఎకో సిస్టమ్‌ దెబ్బతింది. ఏపీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లింది. ఏపీలో రూ.10లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. ఆదాయం చాలా తక్కువగా ఉంది. వీటిని అదిగమించాల్సిన అవసరమున్నది. 

రాజకీయాలలో ఎప్పుడైనా మనం చేసిన పనులే శాశ్వతం. 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అభివృద్ధి చేసినా ఖైరతాబాద్‌లో ఓడిపోయాం. కానీ మనం చేసిన పనులు శాశ్వతంగా మిగిలపోయాయి. ఈ పనులు జాతికి ఏవిధంగా ఉపయోగపడ్డాయో అవే ముఖ్యం.

తెలంగాణ రాష్ట్రంలో 40 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్నవారు ఉన్నారు. 25 సంవత్సరాలుగా రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేదు. ప్రజా క్షేత్రంలో నాయకులు ఉండాలి. 1996, 97లో తెలుగుదేశం ప్రభుత్వంలో రామచంద్రరాజు కమిషన్‌ వేసి ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ చేసి అమలు చేయడం జరిగింది. 2004 వరకు వర్గీకరణ వల్ల న్యాయం జరిగింది. ఆనాటి ప్రభుత్వం సరిగా వాదనలు వినిపించకపోవడంతో వర్గీకరణకు వ్యతిరేకంగా ఆనాడు సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చింది. 2024 సంవత్సరంలో అప్పుడు మనం చేసిన వర్గీకరణ సబబు అని అది సోషల్‌ జస్టిస్‌కు నాంది పలుకుతుందని ఏడుగురుతో సుప్రీం కోర్టు ధర్మాసనం 6:1 మెజారిటీ తీర్పు చెప్పడం జరిగింది. ఆ రోజు మనం చేసింది ఈ రోజు రిలవెంట్‌ అయ్యింది. తెలుగుదేశం పార్టీ అంటే వెనుకబడిన వర్గాల పార్టీ. దీనిని మళ్లీ శక్తివంతంగా చేసుకోవాలి. అసాధ్యమని కొంత మంది అన్నా కృష్ణా నీటిని హైదరాబాద్‌కు తీసుకొచ్చాం.

పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చెప్పాలి. ప్రజలతో నాయకులు అనుసంధానం చేసుకుని వెళ్లాలి. ప్రజలకు నమ్మకం కలిగించాలి. పార్టీకి, నాయకులకు ఇవే ప్రధాన అంశాలుగా కావాలి. పార్టీని ఎలా ఆర్గనైజింగ్‌ చేసుకోవాలో సిన్సియర్‌గా ఆలోచించాలి. పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రణాళిక తయారు చేసుకోవాలి.

సభ్యత్వ నమోదుపైనే మొదట శ్రద్ధ వహించాల్సిన అవసరముంది. కింది నుంచి పైకి వద్దాం. దీని వల్ల సస్టయినబుల్‌ లీడర్‌ షిప్‌ వస్తుంది. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం రావాలి. ఇక్కడ పార్టీని నమ్ముకుని ఉన్న వారికి న్యాయం జరగాలి. కార్యకర్తల నుంచి నాయకత్వాన్ని తయారు చేసుకుని యువతను అభివృద్ధి చేసుకోవాలి.

ఈ కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు, అరవింద్‌ కుమార్‌గౌడ్‌, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ తెలుగుదేశంపార్టీ సమన్వయకర్త కంభంపాటి రామమోహన్‌రావు, జాతీయ పార్టీ ఉపాధ్యక్షులు చిలువేరు కాశీనాథ్‌, జాతీయ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, ప్రేమ్‌కుమార్‌ జైన్‌, తిరునగరి జ్యోత్స్న, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షరాలు కాట్రగడ్డ ప్రసూన, బండి పుల్లయ్య, నందమూరి సుహాసిని, డాక్టర్‌ వాసిరెడ్డి రామనాథం, సామ భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here