వైద్య ఆరోగ్య శాఖ, ఆంధ్రప్రదేశ్
7-8-2024
2014-19లో పనిచేసిన అధికారులు, ప్రస్తుతం పనిచేస్తున్న శాఖాధికారులతో ఎపి సచివాలయంలో
వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ , వైద్య విద్యా శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖను మరింత బలోపేతం చేసేందుకు సలహాలు
, సూచనలు ఇవ్వాలని మంత్రి కోరారు. అధికారులందరూ పూర్తి స్థాయిలో పారదర్శకంగా పనిచేయాలన్నారు. మరింత మెరుగైన సేవల్ని అందించేందుకు కృషి చేయాలన్నారు. పని నిర్వహణలో ఎలాంటి రాజకీయ ఒత్తిడులకూ తలొగ్గద్దన్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలందించడమే ప్రధానమన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలన్నారు. 2014-19లో అమలు చేసిన పధకాలు, కార్యక్రమాల్ని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. వైద్య ఆరోగ్య శాఖను ప్రజలకు చేరువ చేసేందుకు అన్ని విధాలా సంసిద్ధంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల అభీస్టానికనుగుణంగా పనిచేయాలని నిర్ణయించుకున్నందున ఆ దిశగా అధికారులు అడుగులు వేయాలన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలన్న దృక్పథంతో ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా చిస్తోందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతల్ని గుర్తెరిగి పనిచేస్తే ప్రజల మన్ననల్ని పొందొచ్చన్నారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల, కమీషనర్ సి.హరికిరణ్, ఎపిఎంఎస్ ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సిఇఓ డాక్టర్ జి.లక్ష్మీషా, సెకండరీ హెల్త్ డైరెక్టర్ మరియు ఎపి శాక్స్ పీడీ అట్టాడ సిరి, డిఎంఇ డాక్టర్ నరసింహం, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బీవీ రావు, డీడీలు అప్పారావు, గణపతిరావు, రాజశేఖర్ రెడ్డి, ప్రకాశరావు, సెకండరీ హెల్త్ జాయింట్ కమీషనర్ డాక్టర్ రమేష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.