
వి.యం.సి లో శ్రీ కనకదాస్ జయంతి సందర్భంగా ఘన నివాళులు
భక్త కనకదాసు ప్రధాన రచనలు కన్నడంలో రచించిరట్లు అదనపు కమిషనర్ (జనరల్) ఏ. రవీంద్రరావు తెలిపారు. శనివారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద శ్రీ కనకదాసు జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ (జనరల్) ఏ.రవీంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్త కనసాదాసు 516వ జయంతి వేడుకల లో సందర్భంగా భక్త కనకదాసు గురించి ప్రతి ఒక్కరు తెలుసుకునే ఆవశ్యకత ఉందని, కనకదాసు నరసింహ స్తోత్రం, రామధ్యాయ మంత్రం, మోహన తరంగిణి అనే వాటిని రచించినట్లు వివరించారు. నలచరిత్ర, హరిభక్తిసార, తదితర రచనలను కన్నడంలో రచించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ బాబు శ్రీనివాస్, డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) ఏ.శ్రీనివాసరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
![]()
