Home Political news విశాఖ ఉక్కు పరిరక్షణలో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం

విశాఖ ఉక్కు పరిరక్షణలో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం

2
0

విశాఖ ఉక్కు పరిరక్షణలో  పవన్ కళ్యాణ్  పాత్ర కీలకం

కార్మికుల పక్షాన చిత్తశుద్ధితో పోరాటం చేశారు

కేంద్రం ప్రకటించిన భారీ ప్యాకేజీ విశాఖ ఉక్కుకు వరం

కార్మికుల చిరకాల వాంఛ నెరవేరడానికి కూటమి ప్రభుత్వం కృషి

కేంద్ర సాయం పట్ల కార్మికుల్లో హర్షాతిరేకాలు

ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  చిత్రపటానికి స్టీల్ ప్లాంట్ కార్మికుల పాలాభిషేకం

‘విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్  కీలక పాత్ర పోషించార’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, గాజువాక ఇంఛార్జ్  కోన తాతారావు స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన వెలువడిన వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దల ఎదుట పరిశ్రమ పరిరక్షణకు బలంగా వాదన వినిపించిన ఏకైక నాయకుడు  పవన్ కళ్యాణ్  అని తెలిపారు. విశాఖ ఉక్కుపై ఎప్పటికప్పుడు కేంద్ర పెద్దలను కలుస్తూ చిత్తశుద్ధితో పోరాడిన నాయకుడు  పవన్ కళ్యాణ్  అన్నారు. ఆయన కృషి ఫలించి నేడు కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 11,440 కోట్ల భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిందని చెప్పారు. కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజీ ఉక్కు పరిశ్రమకు వరం లాంటిదని తెలిపారు. శనివారం స్టీల్ ప్లాంట్ ప్రధాన ముఖద్వారం వద్ద స్వర్గీయ  టి. అమృతరావు  విగ్రహం వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులు, జనసేన శ్రేణులు  పవన్ కళ్యాణ్  చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 

ఈ సందర్భంగా  కోన  తాతారావు మాట్లాడుతూ.. “స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో కీలక పాత్ర పోషించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి స్టీల్ ప్లాంట్ కార్మికుల తరఫున, గాజువాక ప్రజల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నాము. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా 3 లక్షల మందితో ఇదే ముఖద్వారం వద్ద బహిరంగ సభ నిర్వహించి ఉద్యోగులు, నిర్వాసితుల్లో భరోసా నింపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పిస్తామని, ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని ప్రతిసారీ చెబుతూ వచ్చారు. కార్మిక సంఘాల నాయకులతోనూ పలు దఫాలుగా సమావేశమై వారి ఆవేదనను కేంద్రానికి తెలపడంలో కీలక భూమిక పోషించారు. ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు తో కలిసి ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి భారీ ఆర్ధిక ప్యాకేజీ ఇప్పించారు. కేంద్రం నిర్ణయం పట్ల కార్మికులతో పాటు విశాఖ వాసుల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయ’ని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు  గడసాల అప్పారావు,  దల్లి గోవింద్ రెడ్డి,  గవర సోమశేఖర్,  ఇందిరా ప్రియదర్శిని,  గంధం వెంకటరావు,  గలకోటి సోమన్న, శ్రీ కోన చిన అప్పారావు,   మేడిసెట్టి విజయ్,  రౌతు గోవింద రావు,  దాసరి జ్యోతి రెడ్డి,  దాసరి త్రినాద్,  మొల్లి వెంకట రమణ,  ములకలపల్లి వంశీ, కార్మిక నాయకులు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here