Home Crime News విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలను వివరించిన జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు ఐపిఎస్

విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలను వివరించిన జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు ఐపిఎస్

3
0

 ఇంటి దొంగ ఆట కట్టించిన కృష్ణ జిల్లా పోలీసులు

విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలను వివరించిన జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు ఐపిఎస్

ఈ కేసులో అరెస్టు కాబడిన ముద్దాయి వివరాలు

గన్నె సోమశేఖర్ 

 మచిలీపట్నం కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ నందు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ గా పని చేస్తున్న గన్నే సోమశేఖర్, బ్రాంచ్ నందు వివిధ ఖాతా దారులు తనఖా పెట్టిన బంగారు వస్తువులను కంపెనీ యజమాన్యం ను మోసం చేసి బంగారు ఆభరణాలను అక్రమంగా తీసుకొని పోయి విజయవాడలోని వివిధ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలలో మరియు తాను పనిచేసే కర్ణాటక బ్యాంకులో తాకట్టుపెట్టి లోన్లు తీసుకొని తన సొంతానికి వాడుకున్నాడు. 

 బ్యాంకు వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది. 

జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ వి.వి నాయుడు నేతృత్వంలో, బందరు డిఎస్పి సి.హెచ్ రాజా ఆధ్వర్యంలో ,ఆర్ పేట సీఐ కె. ఏసు బాబు చిలకలపూడి సిఐ అబ్దుల్ నబీ , మరియు సిసిఎస్ సిఐ కె.వి.ఎస్ వరప్రసాద్ తో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ విచారణలో మొత్తం కర్ణాటక బ్యాంక్ నందు 3002.8 గ్రాముల బంగారం మరియు 234.6 గ్రాముల నకిలీ గోల్డ్ ను దుర్వినియోగం చేసినట్లుగా గుర్తించారు.

దర్యాప్తులో భాగంగా గన్నె సోమశేఖర్ ను 31.01.2025 తేదీన అరెస్టు చేసి , విచారించి ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఇప్పటివరకు మొత్తం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC), కర్ణాటక బ్యాంకు నుండి 2603.2 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగింది. 

ఇంకా కొంత బంగారం మరికొన్ని NBFC ల నుండి రికవరీ చేయవలసి ఉంది. 

  ఈ కేసు లో ఎంతోమంది తమ కుటుంబ అవసరాల నిమ్మిత్తము వారి బంగారు అభరణము లు ను ఎంతో నమ్మకం తో ఈ బ్రాంచ్ నందు తాకట్టు పెట్టగా, పై ముద్దాయి బాధితుల బంగారాన్ని తస్కరించి మోసానికి పాల్పడగా , వారి బంగారము ను తిరిగి వారికి అప్పచెప్పాలి అని సదుద్దేశం తో ఎస్పి ఈ కేసు ను అంత్యంత ప్రతిస్టాత్మకంగా స్వీకరించి , ప్రత్యేక బృందాలు ను ఏర్పాటు చేయడం జరిగింది. 

ఇటీవల కాలంలో ఒక కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రామాణికంగా తీసుకొని,

 మొట్ట మొదటిసారిగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలలో ఉన్న బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ

ప్రతి ఒక్క నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ మరియు గోల్డ్ లోన్లు ఇచ్చే సంస్థ ఏదైనాప్పటికీ మంజూరు చేసే ముందు కస్టమర్ యొక్క పూర్వాపరాలు మరియు లోన్ హిస్టరీ/ సిబిల్ పరిశీలించి ప్రాసెస్ చేయవలసిందిగా తెలిపారు. 

తద్వారా కంపెనీ నష్టపోకుండా మరియు నేరస్తులకు ప్రాపర్టీ దుర్వినియోగానికి పాల్పడే అవకాశం లేకుండా ఉంటుంది. 

ఈ కేసును చాకచక్యంగా చేదించిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here