విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ అవయవాలు, ఉపకరణాలు అందజేత.
అందజేసిన శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు
222 మందికి రూ.43.20 లక్షల విలువైన కృత్రిమ అవయవాలు, ఉపకరణాలు పంపిణీ.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 14.06.2025.
మైలవరం నియోజకవర్గ పరిధిలోని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు 222 మందికి రూ.43.20 లక్షల విలువైన కృత్రిమ అవయవాలను, వివిధ ఉపకరణాలను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు శనివారం పంపిణీ చేశారు.
మైలవరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్దులకు కావలసిన బ్యాటరీతో నడిచే మూడు చక్రముల బండ్లు, మూడు చక్రముల బండ్లు, వీల్ చైర్స్, చంక కర్రలు, చెవిటి మిషన్లు, కృత్రిమ అవయవాలు, క్యాలిపర్స్, ఏం.ఆర్. కిట్లు మొదలగు ఉపకరణాలను పంపిణీ చేశామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న వీటిని సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు. ఇంకా అర్జీలు పెట్టుకున్న వారికి త్వరలోనే కృత్రిమ అవయవాలు, ఉపకారణాలను ఉచితంగా అందిస్తామన్నారు.
ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ ద్వారా నియోజకవర్గంలోని విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 49 మందికి రూ.29,40,000/- విలువ చేసే బ్యాటరీతో నడిచే మూడు చక్రముల బండ్లు, 55 మందికి రూ.5,50,000/- విలువ చేసే మూడు చక్రముల సైకిళ్ళు, 29 మందికి రూ.5,52,300/- విలువ చేసే వీల్ చైర్లు, 36 మందికి రూ.36,000/- విలువ చేసి చంకకర్రలు, 29 మందికి రూ.1,85,600/- విలువ చేసే చెవిటి మిషన్లు, 12మందికి రూ.12,000/- విలువ చేసే చేతి కర్రలు, 9 మందికి రూ.45,000/- విలువ చేసి రోలేటరులు… మొత్తం 222 మందికి రూ.43,20,900/- విలువ చేసి ఉపకరణాలు ఉచితముగా అందజేసినట్లు శాసనసభ్యులు కృష్ణప్రసాదు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.