21-0302025 దేవినగర్ 8వ లైన్ లో ట్రెండ్ సెట్ డేటెడ్ కమ్యూనిటీ ప్రాంతంలోని కామన్ స్థలంలో స్థానికులు నిర్మిస్తున్న వినాయకుడి గుడిని తప్పుడు సమాచారంతో గుడిని కూల్చి వేయడానికి వచ్చిన విఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులను ఆపి వారిని
అక్కడనుండి వెళ్లిపోవాలని చెప్పి ఈ గుడి పూర్తయ్యే వరకు తానే బాధ్యత తీసుకుంటానని వినాయకుని గుడికి విరాళంగా లక్ష రూపాయలను తన సొంత నిధులతో ఇచ్చిన ప్రభుత్వ విప్,సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
స్థానిక ప్రజలతో ఆయన మాట్లాడుతూ.. ప్రార్థన స్థలాలు సున్నితమైన అంశమని అధికారులు ఇది దృష్టిలో పెట్టుకుని మిస్సులుకోవాలని హితవు పలికారు. ప్రతి మతాన్ని గౌరవించే సంస్కృతి కూటమి ప్రభుత్వముది అని తెలియజేశారు. ఈ సందర్భంగా వెంటనే స్పందించినందుకు గుడి నిర్వాహకులు, స్థానిక ట్రెండ్ సెట్ వాసులు ఎమ్మెల్యే బోండా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ట్రెండ్ సెట్ పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు