*07.12.2024*
విద్యాలయాలను దేవాలయాలుగా భావించాలి
పాఠశాలల అభివృద్ధికి పూర్వవిద్యార్థులు ముందుకు రావాల
*విద్యావ్యస్థలో మంత్రి నారా లోకేష్ సంస్కరణలు తీసుకువస్తున్నారు*
*మెగా పేరెంట్స్-టీచర్స్ సమావేశం లో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్*
విద్యాలయాలను దేవాలయాలు లా భావించాలని గన్నవరం శాసనసభ్యులు , ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు. మెగా పేరెంట్స్-టీచర్స్ సమావేశం లో భాగంగా శనివారం రామవరప్పాడు జిల్లా పరిషత్ పాఠశాల , నిడమానూరు జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి అనంతరం విద్యార్థులతో ముచ్చటించి … పలు పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణాజిల్లాలో జిల్లా పరిషత్ స్కూల్స్ లో నిడమానూరు జిల్లా పరిషత్ పాఠశాల అతి పెద్దది అని అన్నారు. ఈ పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకారం అందించాలని తన సహకారం ఎప్పుడు ఉంటుందని వెల్లడించారు. ఈ పాఠశాలలో చదివిన ఎంతో మంది విదేశాలలో స్థిరపడ్డారని, ఒక వాట్స్ యాప్ గ్రూప్ ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థులను ఐక్యం చేయాలన్నారు. రాజుల పాలనలో ఆలయాలకు మాన్యాలు ఇచ్చేవారని స్వతంత్రం వచ్చిన తర్వాత పాఠశాలలకు విరాళాలు ఇచ్చేవారని చెప్పారు. అలాంటి నాయకులూ ఇప్పుడు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తాను చదువుకున్న కెసిపి పాఠశాల ల్యాబ్ కోసం విరాళం ఇచ్చానని, చదువుకున్న కళాశాలకు తరగతుల నిర్మాణం చేసానని ఇదే స్పూర్తితో పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలకు ఏదోఒకటి చేయాలనీ పిలుపునిచ్చారు. నిలిచిపోయిన తరగతి గదుల నిర్మాణ పనులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చి వాటిని పూర్తి చేసేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. స్కూల్ పరిసర ప్రాంతాలలో గంజాయి సంస్కృతి ఎక్కువగా ఉందని తన దృష్టికి వచ్చిందని డీస్పీకి, సర్కిల్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి గంజాయి ఆనవాళ్ల పై ఉక్కుపాదం మోపాలని ఆదేశిస్తానని స్పష్టం చేశారు. కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సహకరిస్తానని అన్నారు. జిల్లాల పునర్విభజన కారణంగా నిడమానూరు జిల్లా పరిషత్ పాఠశాలకు డిఎంఎఫ్ ఫండ్ ఇవ్వలేకపోతున్నాని చెప్పారు. వాటర్ షెడ్ నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని సూచించారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నారని ఇందులో భాగంగా మెగా పేరెంట్స్-టీచర్స్ సమావేశం నిర్వహించారని వెల్లడించారు.ఈ కార్యక్రమం లో ఎంఈఓ లు అరూరు వెంకట రత్న, సూరిబాబు , విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు గొడ్డళ్ళ చిన రామారావు , నాయకులు బండి వెంకట్రావు (నాని) , గూడవల్లి నరసింహారావు , కొల్లా ఆనంద్ , మదాల నాని, పొదిలి దుర్గారావు , జాలాది రామచంద్రరావు , షేక్ ఆదాం షఫీ, విజయ , అడుసుమిల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు .