Home Political news విద్యార్థులు నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి వెస్ట్ లో అన్ని స్కూళ్లను అభివృద్ధి...

విద్యార్థులు నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి వెస్ట్ లో అన్ని స్కూళ్లను అభివృద్ధి పరుస్తాం.. ఎం ఎల్ ఎ సుజానా చౌదరి

3
0

 విద్యార్థులు నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి

వెస్ట్ లో అన్ని స్కూళ్లను అభివృద్ధి పరుస్తాం..

ఎం ఎల్ ఎ సుజానా చౌదరి 

విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలంటే నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు . విద్యాధరపురంలోని లేబర్ కాలనీ జి యన్ ఆర్ ఎం సి పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం, ఐ ఒ టి డిజిటల్ ల్యాబ్ ను ఎమ్మెల్యే సుజనా శుక్రవారం ప్రారంభించారు. సీడ్స్ స్వచ్ఛంద సంస్థ, సుజనా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో  3 లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన గ్రంథాలయాన్ని , రూ 10 లక్షల రూపాయలతో  ఏర్పాటుచేసిన చేసిన  అత్యాధునిక డిజిటల్ ల్యాబ్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.. విద్యార్ధుల కోసం ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారిచే ఏర్పాటుచేసిన కంటి పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీడ్స్ సంస్థ, సుజనా ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలు కార్పొరేట్  విద్యను అభ్యసించేలా జిఎన్ఆర్ఎంసి పాఠశాలను   అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. 

ఈ స్కూల్ ను మోడల్ చేసి.. నియోజక వర్గం

లోని మిగతా స్కూల్స్ కూడా అదే తరహా లో చేస్తామన్నారు.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా భవిష్యత్తులో అనేక విప్లవాత్మకమైన మార్పులు సంభవిస్తాయని విద్యార్థులు అప్రమత్తంగా ఉండి పాఠశాల స్థాయి నుంచి టెక్నాలజీని అందుపుచ్చుకోవాలన్నారు. టెక్నాలజీలో నూతన ఒరవడి సృష్టించడం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి, ఉత్సాహాన్ని  పెంపొందించవచ్చన్నారు. సీడ్స్ ఫౌండేషన్, సుజనా ఫౌండేషన్ ద్వారా పాఠశాలను అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. వెస్ట్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అధికారులు, ప్రజాప్రతినిధుల తోడ్పాటు  కూడా అవసరం అన్నారు. పశ్చిమ లోని సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నేటితరం విద్యార్థులందరూ భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవాలంటే టెక్నాలజీని  అంది పుచ్చుకోవాలని ఎమ్మెల్యే సుజనా సూచించారు. అనంతరం గత ఏడాది పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందజేశారు.

సీడ్స్ ఫౌండర్, విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ సి ఎమ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు డిజిటల్ విద్యాబోధన ద్వారా సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ వంటి సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకోవచ్చన్నారు.  వారిలో సృజనాత్మకత, నైపుణ్యం పెంపొందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దోహదం చేస్తుందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను  నిర్వహించడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి ముందడుగు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో ఈవి  సుబ్బారావు, ఇంచార్జ్ హెడ్మాస్టర్  బివి రమణ, కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, సీడ్స్ ఫౌండర్ రామిరెడ్డి చంద్రమహేశ్వర రెడ్డి, గ్రాక్స్ ఫౌండర్ నితిన్, సుజన ఫౌండేషన్ అడ్వైజర్  వేజెండ్ల శ్రీనివాసరావు, కృష్ణమూర్తి, సీడ్స్ ఏపీ సౌత్ మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి, కూటమి నేతలు అడ్డూరి శ్రీరామ్, మైలవరపు దుర్గారావు, మైలవరపు కృష్ణ, గుడివాడ నరేంద్ర రాఘవ, మహాదేవు అప్పాజీరావు, అత్తులూరి పెదబాబు, పైలా సురేష్,  తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here