Home Political news విడదల రజనీ, లేళ్ల అప్పిరెడ్డి దగ్గర పనిచేసే మనుషులు నా కూతురుని హత్య చేశారు

విడదల రజనీ, లేళ్ల అప్పిరెడ్డి దగ్గర పనిచేసే మనుషులు నా కూతురుని హత్య చేశారు

3
0

 విడదల రజనీ, లేళ్ల అప్పిరెడ్డి దగ్గర పనిచేసే మనుషులు నా కూతురుని హత్య చేశారు

*న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళితే మాపైనే అక్రమ కేసులు బనాయించారు* 

*పొలంలోకి అడుగు పెట్టనీయకుండా బెదిరిస్తున్న వైసీపీ నేతలు*

*గత ప్రభుత్వం అక్రమంగా తొలగించిన పింఛన్లు పునరుద్ధరించండి*

*పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుకు వివిధ ప్రాంతాల ప్రజల విన్నపాలు*

మానవ మృగాలకు కొమ్ముకాసి, నేరస్తులకు రక్షణ కల్పించిన వైసీపీ దుర్మార్గ చర్యలు బయట పడుతున్నాయి. న్యాయం చేయాలని అడిగిన బాధితులపైనే గత ప్రభుత్వంలో పోలీసులు కేసులు పెట్టి వేధించిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కూతురి హత్య కేసులో న్యాయం చేయాలని ఓ మహిళ విన్నవించుకోగా… పొలంలోకి దిగితే వైసీపీ నేతలు చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితులు సమస్యను విన్నవించుకున్నారు. గత ప్రభుత్వంలో అకారణంగా తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని పలువురు వికలాంగులు కోరారు. అనారోగ్యం, ఇతర సమస్యలతో బాధపడేవారికి సీఎం ఆర్థికసాయం చేశారు. అంతకముందు పార్టీ నేతలతో సభ్యత్వ నమోదుపై సమీక్షించారు. 

*చిత్రహింసలు పెట్టి నా కూతరుని చంపేశారు….*

డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న తన కూతురు 2022 జూలై 4న కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని, అదే కాలనీలో ఉంటున్న ఆటో డ్రైవర్ ఆనంద్ అనే యువకుడు ప్రేమపేరుతో వంచించాడని గుంటూరు జిల్లా, గుజ్జనగుళ్లకు చెందిన నిశంకర శంకరలీల అనే మహిళ సీఎం వద్ద మొరపెట్టుకున్నారు. 14 నెలల పాటు తన కూతురుని చిత్రహింసలు పెట్టి బండారు ఆనంద్, అతని సోదరులు అరవింద్, అజిత్ వారి మేనమామ తిరుపతిరావు, అత్త అంకలక్ష్మీ తన కూతురుని శవంగా పంపించారని కన్నీటి పర్యంతమయ్యారు. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం…..‘నా కూతురి హత్యపై రెండేళ్లుగా పోరాడుతుంటే మాపైనే హత్యాయత్నం కేసులు పెట్టారు. ఆ కేసులో రెండేళ్లుగా తిరుగుతున్నాం. తాము వైసీపీ నేతలలైన మాజీ మంత్రి విడదల రజనీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దగ్గర పని చేస్తామని నిందితులు బెదిరించారు. చేతికి అందివచ్చిన కూతుర్ని  పోగొట్టుకున్నదేకాక అక్రమంగా పెట్టిన కేసులో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము. న్యాయం చేయాలని నాటి నల్లపాడు సీఐని కోరగా అసభ్య పదజాలంతో దూషించారు. నా కూతురిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి’ అని బాధితురాలు వేడుకున్నారు. శంకరలీల బాధను విన్న సీఎం ఆమెను ఓదార్చారు. కేసులో ఎంతటివాళ్లున్నా వదిలిపెట్టమని, తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. 

*పొలంలోకి అడుగుపెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారు* 

పొలంలోకి అడుగుపెడితే చంపేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని రాజమండ్రి రూరల్ మండలం, హుకుంపేటకు చెందిన బొప్పన సురేష్ బాబు సీఎంకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం….‘‘2021లో చాగళ్లు పరిధిలోని దారవరంలో, మార్కొండపాడు, బ్రాహ్మణగూడెంలో 17 ఎకరాలు  పొలం కొనుగోలు చేశాం. 7.57 రిజిస్ట్రేషన్ కాగా మిగతాది అగ్రిమెంట్ రాయించుకున్నాం. కానీ వైసీపీ నేతలు ఆ పొలంలోకి దిగనీయకుండా, అడుగుపెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత ప్రోద్బలంతో కేసులు పెట్టి వేధించారు. నా పొలం నాకు దక్కేలా చేయండి’ అని విన్నవించారు. 

*వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డాం* 

జగన్ ప్రభుత్వంలో తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామని విజయవాడ వన్ టౌన్‌కు చెందిన అక్కల రోజా, ఆమె భర్త, జవాన్ జ్ఞానానంద్ సీఎం చంద్రబాబు దగ్గర కంటతడి పెట్టుకున్నారు. బిల్డింగ్ 3వ అంతస్తుకు అనుమతి ఇవ్వకుండా ఐదేళ్ల పాటు తిప్పి ఇబ్బందులకు గురి చేశారని జవాన్ దంపతులు మొరపెట్టుకున్నారు. కృష్ణా అనే వ్యక్తి ఇళ్లు కొనుగోలు చేసి రూ.10 లక్షల మేర ఇవ్వకుండా బెదిరించారని, అప్పులపాలై రోడ్డుపాలయ్యామన్నారు. సమస్యను పరిష్కరిస్తామని వారికి సీఎం హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here