Home Andhra Pradesh విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తీర్మానాల వెల్లడి

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తీర్మానాల వెల్లడి

4
0

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తీర్మానాల వెల్లడి

నియోజకవర్గ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ధ్యేయం

ప్రజా సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి, అభివృద్ధికి ₹200 కోట్ల రూపాయల తో ముందుకు తీసుకొని వెళుతున్న MLA బొండా ఉమ కి మహానాడు లో అభినందనల వెల్లువ

మహానాడులో నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక ప్రజల సంక్షేమానికి పెద్దపేట వేస్తామన్న – MLA బొండా ఉమ, MP కేశినేని (చిన్ని) – విలేకరుల సమావేశంలో నవనీతం సాంబశివరావు, ఘంటా కృష్ణ మోహన్

ధి:21-5-2025 బుధవారం ఉదయం 10:00″గం లకు ” సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈనెల 20వ తేదీ నాడు జరిగినటువంటి సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు తీర్మానాలను ప్రతినిధుల చర్చల వివరాలను భవిష్యత్తు కార్యాచరణను ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, మాజీ AMC డైరెక్టర్ గంటా కృష్ణమోహన్లు వెల్లడి చేశారు

ఈ సందర్భంగా నవనీతం సాంబశివరావు, ఘంటా కృష్ణమోహన్ లు మాట్లాడుతూ:- స్థానిక శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు ఈ మహానాడు సభకు అధ్యక్షత వహించిన బొండా ఉమామహేశ్వరరావు ముఖ్యఅతిథిగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు

సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 21 డివిజన్ ల నుంచి 711 మంది ప్రతినిధులు హాజరుకాక గత మహానాడు 18-5-2023 నుంచి నేటి వరకు సెంట్రల్ నియోజకవర్గంలో సెంట్రల్ నియోజకవర్గంలో బొండా ఉమామహేశ్వరరావు నాయకత్వంలో గత అరాచక ప్రభుత్వ హయం లో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఆనాడు అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గ పరిస్థితులపై అర్హులైన ప్రజలకు ప్రభుత్వపరంగా ప్రజలకు అందవలసిన సంక్షేమ పథకాలు అందక పోవడం పై పూర్తిస్థాయిలో చర్చించడం జరిగింది

2014 నుండి 2019 వరకు ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో స్థానిక MLA గా 400 కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి తప్పితే 2019 నుండి 2024 వరకు అభివృద్ధి శూన్యమని సమావేశం నిర్ణయం చేయడం జరిగింది, 2024 ఎన్నికలలో NDA ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం స్థానిక ఎమ్మెల్యేగా బొండా ఉమామహేశ్వరరావు ప్రజల ఆదరణతో 70 వేల ఓట్ల మెజారిటీతో గెలవడం ఈ పది మాసాల కాలంలో సుమారుగా ₹200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన అంశాన్ని సూపర్ 6 పథకాలను ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర రావు నాయకత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందుతున్నాయని, సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు హర్షద్వానాల మధ్యన వ్యక్తం చేయడం జరిగింది

  1. పాయకాపురం సింగినగర్ ప్రాంతాల నుండి నగరంలోకి రావడానికి సింగినగర్ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ రద్దీ పెరగడంతో, వాహనదారులకు పాదచారులకు ఉద్యోగస్తులకు స్కూల్ పిల్లలకు తీవ్ర సమయాభారం జరగడం తో పాటు అనేక ఇబ్బందులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో 2వ ఫ్లై ఓవర్ ను కూడా ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానం చేయడం జరిగింది
  2. గుణదలలో ఆగిపోయిన ఫ్లైఓవర్లు రెండు 1 గుణదల నుండి ఉలవచారు కంపెనీ మీదగా వెళ్లేటువంటి ఫ్లైఓవర్, మరొకటి గుణదల నుండి డాన్ బాస్కో స్కూల్ మీదగా వెళ్లేటువంటి ఫ్లై ఓవర్ ను వెంటనే ప్రారంభించాలని తీర్మానం చేయడం జరిగింది

3.మధురానగర్ పప్పుల మిల్లు నుండి వాంబే కాలనీ మీదగా వెళ్లేటువంటి ఫ్లై ఓవర్ ను కూడా తక్షణమే ప్రారంభించాలి అని తీర్మానం చేయడం జరిగింది

  1. నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్న రిజిస్ట్రేషన్లు కానీ ఇళ్లకు NDA ప్రభుత్వం జారీ చేసిన GO.30 ద్వారా రిజిస్ట్రేషన్లు చేపించాలి అని సమావేశం తీర్మానం చేయడం జరిగింది
  2. శాశ్వత బుడమేరు ముప్పు నివారణ చర్యలు తీసుకోవాలి అని సమావేశం తీర్మానం చేయడం జరిగింది
  3. సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు బొండా ఉమా నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధికి MP కేశినేని శివనాథ్ చిన్ని నిధులతో అభివృద్ధి చేయాలని సమావేశం తీర్మానం చేయడం
  4. నియోజకవర్గంలో ఉర్దూ స్కూల్ ను ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానం చేయడం జరిగింది
  5. ముత్యాలంపాడు అయోధ్య నగర్ మధ్యలో ఉన్నటువంటి ఏలూరు కాలువపై వంతెనను నిర్మించాలి అని సమావేశం తీర్మానం చేయడం జరిగింది
  6. కొత్త రాజరాజేశ్వరి పేట నుండి పాత రాజరాజేశ్వరి పేటకు మధ్యన RUB ని ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానం చేయడం జరిగింది

10.30వ డివిజన్లో BC హాస్టల్ను తిరిగి పునర్ ప్రారంభించాలి అని తీర్మానం చేయడం జరిగింది

  1. శ్రీనగర్ కాలనీ నుండి సత్యనారాయణపురం రైల్వే కాలనీలోకి BRTS రోడ్డు లోకి రావడానికి అడ్డుగా ఉన్న గోడను రైల్వే వారు తొలగించాలి అని సమావేశం తీర్మానం చేయడం జరిగింది

12.పాయకాపురం రాధానగర్ ప్రాంతాలలో ఉన్న బాలికల సంక్షేమ హాస్టల్, బాలుర సంక్షేమ హాస్టల్ కు కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి పరచాలి అని సమావేశం తీర్మానం చేయడం జరిగింది

ఈ విలేకరుల సమావేశంలో పై వారితోపాటు నాయకులు డివిజన్ అధ్యక్షులు ఆకుల సూర్యప్రకాష్, R బంగారు నాయుడు, గరిమెళ్ళ చిన్న, బెజ్జం జయపాల్, కోలా దుర్గారావు, బెజవాడ తిరుపతి, చిలువెళ్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here