విజయవాడ రూరల్ మండలంలోని 9 గ్రామాలను ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలోకి చేర్చాలి
కబ్జాకు గురవుతున్న కామన్ ల్యాండ్ల పై విచారణ జరిపించాలి
అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం నియోజకవర్గ పరిధిలోని విజయవాడ రూరల్ మండలంలో ఉన్న 9 గ్రామాలను ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలోకి చేర్చి, ప్రజల్లో నెలకొన్న కన్ఫ్యూజన్ ను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఈరోజు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.
విజయవాడ రూరల్ మండలంలో 9 గ్రామాలు ఉండగా ప్రస్తుతం 2 గ్రామాలు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో, 5 గ్రామాలు పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో మిగిలిన రెండు గ్రామాలు నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయని, వీటన్నిటిని ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకొచ్చినట్లయితే ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు వీలవుతుందని తెలిపారు.
గన్నవరం నియోజకవర్గ పరిధిలోని విజయవాడ రూరల్ మండలంలో దాదాపు 94 వేల మంది ఓటర్లు, 1 లక్ష 70 వేల మంది జనాభా ఉన్నారని పోలీస్ స్టేషన్లు వివిధ ప్రాంతాల్లో, కమిషనరేట్ లో ఉండటం వల్ల కన్ఫ్యూజన్ నెలకొందని ప్రభుత్వం దృష్టికి తెలిపారు.
విజయవాడ పట్టణాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల పరిధిలోని వెంచర్లలో కామన్ ల్యాండ్లు అన్యాక్రాంతానికి గురైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ఉదాహరణ అంబాపురం గ్రామంలోని వెంచర్ లో కామన్ ల్యాండ్ కబ్జాకు గురవుగా, ప్రశ్నించిన అంబాపురం గ్రామ సర్పంచ్ పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని అన్నారు.
విజయవాడ రూరల్ మండలంలోని 9 గ్రామాలను ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో చేర్చి ప్రస్తుతం ప్రజల్లో నెలకొన్న కన్ఫ్యూజన్ ను తొలగించాలని, అలాగే శివారు ప్రాంత వెంచర్లలోని కామన్ ల్యాండ్లు అన్యాక్రాంతానికి గురవుతున్నాయని వాటిపై ఎంక్వైరీ వేయవలసిందిగా ప్రభుత్వం దృష్టికి తెలియజేశారు.