విజయవాడ మున్సిపల్ కమిషనర్గా ధ్యానచంద్ర నియామకం
విజయవాడ:- విజయవాడ నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్గా ధ్యానచంద్రను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ధ్యానచంద్ర తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్గా తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.