అమరావతి :
విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి
శాంతిభద్రతలను కాపాడటంలో ఏమాత్రం రాజీపడేది లేదు…
పటిష్ట యంత్రాంగంగా తయారు చేయడం మా కర్తవ్యం…
ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణచివేశాం…
రాష్ట్ర విభజన తర్వాత పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చాం…
వాహనాలు, పరికరాలు, సాంకేతిక సౌకర్యాలు కల్పించాం…
ఏపీ పోలీస్ అంటే దేశంలోనే మోడల్గా తీర్చిదిద్దాలని ముందుకెళ్లాం…
2014-19లో పోలీస్ శాఖకు రూ.600 కోట్లు ఖర్చు చేశాం…
పోలీస్ స్టేషన్ల మరమ్మతులు, నిర్వహణ కోసం రూ.60 కోట్లు ఖర్చు చేశాం…
విధి నిర్వహణలో చాలామంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు…
ప్రజల హృదయాల్లో అమరులు త్యాగధనులుగా నిలిచారు…
అన్ని శాఖల కంటే పోలీస్ శాఖ అత్యంత కీలకం…
రాష్ట్రంలో ఏ ప్రగతి జరగాలన్నా పోలీసులే కీలకం…
ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు…
అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా…
రూ.27 కోట్లు ఖర్చుపెట్టి APFSL పరికరాలు కొనుగోలు చేశాం…
పోలీసు సంక్షేమానికి ఐదేళ్లలో రూ.55 కోట్లు ఖర్చు చేశాం…
సవాళ్లను ఎదుర్కొనేందుకు ధీటైన పోలీస్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాం…
విశాఖలో గ్రేహౌండ్స్ కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశాం…
కేంద్రం ఎప్పటికప్పుడు పోలీస్ వ్యవస్థ ప్రక్షాళనకు ముందుకొస్తోంది…
పోలీస్ శాఖలో ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది…
పోలీస్ వ్యవస్థకు ఆధునిక పరికరాలు, పరిజ్ఞానం అందిస్తాం…
125 రోజుల్లో పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ చెల్లించాం…
గత ప్రభుత్వం దిశ పేరుతో వాహనాలకు రూ.16 కోట్లు పెండింగ్ పెడితే వాటినీ చెల్లించాం…
కమ్యూనికేషన్ పరికరాల కోసం గత ప్రభుత్వం రూ.20 కోట్లు పెండింగ్ పెడితే వాటినీ చెల్లించాం…
తప్పు చేసిన వ్యక్తిని వెంటనే పట్టుకునే వ్యవస్థ అవసరం…
గత ప్రభుత్వం కక్షసాధింపులే పనిగా పెట్టుకుంది…
రాగద్వేషాలకు అతీతంగా పనిచేసేదే పోలీసు వ్యవస్థ…
గత ప్రభుత్వం సర్వేరాళ్లపై బొమ్మల కోసం కోట్లు తగలేసింది…
సీసీ కెమెరాల కోసం మాత్రం రూ.700 కోట్లు ఇవ్వలేకపోయారు…
నేరాల తీరు మారుతోంది…!?
పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి : సీఎం చంద్రబాబు