Home Political news వాణిజ్య విభాగం అధ్యక్షులు మురళీకృష్ణ (కొండపల్లి బుజ్జి)పై దాడి చేయడం హేయం

వాణిజ్య విభాగం అధ్యక్షులు మురళీకృష్ణ (కొండపల్లి బుజ్జి)పై దాడి చేయడం హేయం

2
0

వాణిజ్య విభాగం అధ్యక్షులు మురళీకృష్ణ (కొండపల్లి బుజ్జి)పై దాడి చేయడం హేయం

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ విఫలమైంది

*మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్*

*వాణిజ్య విభాగం అధ్యక్షులు మురళీకృష్ణ (కొండపల్లి బుజ్జి)పై దాడి చేయడం హేయం*

*రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తెలుగుదేశం పార్టీ బానిస సంకెళ్లలో ఉంది*

*రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా..*

*లోటస్ ల్యాండ్ మార్క్ వద్ద ఏసిపి కార్యాలయం ప్రాంతం ముందే ఈ ఘటన జరిగింది.*

*పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన ఎటువంటి స్పందన లేదు.*

*ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరులతో పాల్పడుతున్నాడు*

*సెంట్రల్ లో సుమారు 35 మందిపై దాడులు జరిగాయి*

*ఎమ్మెల్యే బోండా ఉమా మర్యాదగా దాడులు ఆపాలి.*

*ఈ దాడులు వెనకాల బోండా ఉమా ఉన్నారు.*

*పోలీసు వ్యవస్థ దాడులను ఆపకపోతే… వైసిపి కార్యకర్తలు నాయకులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తాం*

*చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ దాడులపై స్పందించాలి*

వాణిజ్య విభాగం అధ్యక్షులు మురళి కృష్ణ మీద దాడి చేయడం దారుణమని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బోండా ఉమా అను అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా..? లేదా…? అని సూటిగా ప్రశ్నించారు. దాడి జరిగిన ప్రాంతంలోనే ఏసీపీ కార్యాలయము ఉన్న నేరస్థులకు భయం లేకుండా పోయిందనీ అన్నారు. విజయవాడ నగరంలో పోలీసు వ్యవస్థ టిడిపికి అనుకూలంగా పనిచేస్తుందని విమర్శించారు. వైసిపి నాయకులు పై దాడులపై సిపికి కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగిందని తెలిపారు. పోలీసు వ్యవస్థ దాడులను చూసి కూడా నెమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. వైసిపి నాయకులు పై దాడులను ఆపే శక్తి పోలీసులకు ఉందా లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోట మేతల కలిసి వైసిపి నేతలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ విఫలమైందని మండిపడ్డారు. బోండా ఉమా తన అనుచరులతో దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. సుమారుగా సెంట్రల్ నియోజకవర్గంలో 35 మందిపై దాడులు జరిగిన పోలీసులు కన్నెత్తి చేసే పరిస్థితి లేదన్నారు. అధికారం ఎప్పుడూ ఒకవైపే ఉండదని తెలుసుకోవాలన్నారు. దాదాపు నెల రోజుల నుండి దాడులు చేస్తూనే ఉన్నారని, బోండా ఉమా మర్యాదగా దాడులు ఆపాలని లేకుంటే ప్రజా ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. దాడులు చేసిన వారిపై పోలీసులు కూడా నామమాత్రపు కేసులు నమోదు చేస్తున్నారని తప్పుపట్టారు. ఉపముఖ్యమంత్రి పవణ్ కళ్యాణ్ దాడులపై ఎందుకు స్పందించట్లేదు చెప్పాలన్నారు. పోలీసులు చర్యలు తీసుకోపోతే వైఎస్ఆర్సిపి నాయకులు మొత్తం రోడ్డుపైకి వస్తారనీ, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేదని చెప్పారు. దాడులు మళ్లీ కొనసాగితే వైసీపీ నేతలు నాయకులు రోడ్డుపైకి వస్తామని హెచ్చరించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఇప్పటికైనా స్పందించి దాడికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ దాడులు వెనకాల బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యే బోండా ఉమా పై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మేమందరం రోడ్డు మీదకు వచ్చి మా హక్కును మేము కాపాడుకునేందుకు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here