వాట్సప్ ద్వారా నోటీసులు జారీ వద్దు సుప్రీo
వాట్సప్ ద్వారా లేదా మరేదైనా ఎలక్ట్రానిక్ మార్గంలో కానీ పోలీ సులు నిందితులకు నోటీసులు జారీ చేయకూడదని సుప్రీంకోర్టు ఈ నెల 21న స్పష్టం చేసింది. 1973 నాటి Crpc 41ఏ సెక్షన్ లేదా 2023 నాటి భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 35వ సెక్షన్ నిర్దేశించిన పద్ధతిలో మాత్రమే నోటీసులు పంపాలని పేర్కొంది. ఈ మేరకు పోలీసులకు ఉత్తర్వు జారీచేయాలని అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. 1973 నాటి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద పోలీసులు వాట్సప్ లో నోటీసులు జారీచేయగా, నిందితులు దర్యాప్తు అధికారి ముందు హాజరుకాని సందర్భాలు ఉన్నాయని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.