Home Political news వ‌చ్చే మూడేళ్ల‌లో మున్సిపాల్టీల్లో పూర్తి స్థాయి మౌళిక‌వ‌స‌తులు క‌ల్ప‌న‌

వ‌చ్చే మూడేళ్ల‌లో మున్సిపాల్టీల్లో పూర్తి స్థాయి మౌళిక‌వ‌స‌తులు క‌ల్ప‌న‌

3
0

వ‌చ్చే మూడేళ్ల‌లో మున్సిపాల్టీల్లో పూర్తి స్థాయి మౌళిక‌వ‌స‌తులు క‌ల్ప‌న‌

దేశంలోనే ఉత్త‌మ మున్సిపాల్టీల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం

*వ‌చ్చే ఏప్రిల్ నుంచి మున్సిపాల్టీల నిధులు సొంత అవ‌స‌రాల‌కే వినియోగం*

అమ‌రావ‌తి..

దేశంలోనే అత్యుత్త‌మ మున్సిపాల్టీల రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను తీర్చిదిద్దుతామ‌న్నారు పుర‌పాల‌క శాఖ మంత్రి నారాయ‌ణ‌.నాగార్జున యూనివ‌ర్శిటీలోని కాన్ఫ‌రెన్స్ హాల్లో పుర‌పాల‌క మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ ఆధ్వ‌ర్యంలో వ‌ర్క్ షాప్ జ‌రిగింది…ఈ వ‌ర్క్ షాప్ న‌కు మంత్రి నారాయ‌ణ తో పాటు పుర‌పాల‌క శాఖ కార్య‌ద‌ర్శి క‌న్న‌బాబు,మెప్మా ఎండీ తేజ్ భ‌ర‌త్,ప్ర‌జారోగ్య విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ మ‌రియ‌న్న‌తో పాటు మున్పిల్ క‌మిష‌న‌ర్లు,ఇంజినీర్లు హాజ‌ర‌య్యారు..రాష్ట్రంలోని మున్పిపాల్టీల్లో పూర్తి స్థాయిలో మౌళిక వ‌స‌తులు క‌ల్ప‌న‌పై ఈ వ‌ర్క్ షాప్ లో చ‌ర్చించారు.ఆ త‌ర్వాత ముఖ్య అతిధిగా హాజ‌రైన మంత్రి నారాయ‌ణ ప‌లు అంశాల‌పై అధికారుల‌కు దిశానిర్ధేశం చేసారు.

వ‌చ్చే మూడేళ్ల‌లో అన్ని మున్సిపాల్టీల్లో ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన మౌళిక వ‌స‌తులు క‌ల్పించాల‌నే లక్ష్యంగా ప‌నిచేస్తాం…అన్ని మున్సిపాల్టీల్లో తాగునీరు,డ్రైనేజి వాట‌ర్ లైన్లు,వ‌ర‌ద నీటి కాల్వ‌ల నిర్మాణం,వీధి దీపాలు,రోడ్లు క‌ల్పించాల‌ని సీఎం చంద్ర‌బాబు సూచించారు..సీఎం సూచ‌న‌ల మేర‌కు వ‌చ్చే నెలాఖ‌రులోగా ఆయా ప‌నుల‌కు సంబంధించిన డీపీఆర్ లు సిద్దం చేయాలి…డీపీఆర్ లు అనుమ‌తి పొంది ప‌నులు ప్రారంభించిన త‌ర్వాత మూడేళ్ల‌లో అన్ని ప‌నులు పూర్తిచేయాల‌న్నారు మంత్రి నారాయ‌ణ‌..ఆయా ప‌నుల‌కు అవ‌స‌ర‌మైన నిధుల‌ను ప్ర‌భుత్వం స‌మ‌కూరుస్తుంద‌న్నారు..కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ప‌లు ప‌థ‌కాల ద్వారా వ‌చ్చే నిధుల‌కోసం సంప్ర‌దింపులు జ‌రిపి త్వ‌రిత‌గ‌తిన తీసుకొచ్చే ప్ర‌యత్నం చేస్తామ‌న్నారు.దేశంలోనే ఉత్త‌మ మున్సిపాల్టీల రాష్ట్రంగా ఏపీని నిల‌బెట్టాల‌ని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు,ఇంజినీర్ల‌కు సూచించారు.వ‌చ్చే ఆర్ధిక సంవ‌త్స‌రం నుంచి మున్సిపాల్టీల నిధుల‌ను సొంత ఖ‌ర్చుల‌కే వినియోగించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి తెలిపారు.

మున్సిపాల్టీల అభివృద్ది కోసం ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక విభాగంలో సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చామ‌న్నారు…వేస్ట్ టు ఎన‌ర్జీ ప్లాంట్లు నెలకొల్ప‌డం ద్వారా చెత్త లేకుండా చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌న్నారు.2014-19 మ‌ధ్య టీడీపీ హ‌యాంలో ప‌న్నులు పెంచ‌లేద‌న్నారు…గ‌త ప్ర‌భుత్వం కేంద్రం ఇచ్చిన నిధుల‌కు మ్యాచింగ్ ఫండ్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఏషియ‌న్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంక్ నిధులు,అమృత్ నిధులు నిలిచిపోయాయ‌న్నారు…ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన అన్ని వ‌స‌తులు క‌ల్పిస్తూ ఎవ‌రినీ ఇబ్బంది పెట్ట‌కుండా ప‌న్నులు వ‌సూలు చేయాల‌ని మంత్రి నారాయ‌ణ అధికారుల‌కు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here