Home Andhra Pradesh ళవాహ‌న చోద‌కుల‌కు మాన‌సిక ప్ర‌శాంతత అవ‌స‌రం మమాన‌సిక ప్ర‌శాంత‌త‌ను ప్ర‌సాదించే యోగాను ఆచ‌రించాలి జిల్లా క‌లెక్ట‌ర్...

ళవాహ‌న చోద‌కుల‌కు మాన‌సిక ప్ర‌శాంతత అవ‌స‌రం మమాన‌సిక ప్ర‌శాంత‌త‌ను ప్ర‌సాదించే యోగాను ఆచ‌రించాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

4
0

*ఎన్‌టీఆర్ జిల్లా, మే 28, 2025 ళవాహ‌న చోద‌కుల‌కు మాన‌సిక ప్ర‌శాంతత అవ‌స‌రం మమాన‌సిక ప్ర‌శాంత‌త‌ను ప్ర‌సాదించే యోగాను ఆచ‌రించాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మాన‌సిక ప్ర‌శాంత‌త ద్వారానే ప్ర‌మాద ర‌హిత సుర‌క్షిత‌మైన ప్ర‌యాణం చేయ‌గ‌లుగుతామ‌ని, మాన‌సిక ప్ర‌శాంత‌తను ప్ర‌సాదించే యోగాస‌నాల‌కు వాహ‌న చోద‌కులు కొంత స‌మ‌యాన్ని కేటాయించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సూచించారు.యోగాంధ్ర-2025 మాసోత్స‌వాల సంద‌ర్భంగా బుధ‌వారం విజ‌య‌వాడ‌లోని బీఆర్‌టీఎస్ యోగాస్ట్రీట్ నందు జిల్లా ర‌వాణా శాఖ ఆధ్వ‌ర్యంలో వాహ‌న చోద‌కుల‌కు నిర్వ‌హించిన ప్ర‌త్యేక యోగా శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పాల్గొన్నారు. వాహ‌న చోద‌కుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ యోగాస‌నాల‌ను అభ్య‌సించారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ యోగా ద్వారా మాన‌సిక ప్ర‌శాంత‌త చేకూరుతుంద‌ని, ముఖ్యంగా వాహ‌న చోద‌కుల‌కు మాన‌సిక ప్ర‌శాంత‌త అవ‌స‌ర‌మ‌ని, ఏమాత్రం ఒత్తిడికి లోనైనా ప్ర‌మాదాలు బారినప‌డే అవ‌కాశాలు ఉంటాయ‌న్నారు. డ్రైవ‌ర్లు ప్ర‌తిరోజూ ఎంతో కొంత స‌మ‌యాన్ని యోగాస‌నాల‌కు కేటాయించాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. డ్రైవ‌ర్ల‌లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు యోగాంధ్ర కార్య‌క్ర‌మం ద్వారా జిల్లాలో డ్రైవ‌ర్ల‌కు యోగాస‌నాల శిక్ష‌ణ‌, అవ‌గాహ‌న కల్పిస్తున్నామ‌ని, త‌ద్వారా ప్ర‌మాద ర‌హిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్న‌ట్లు తెలిపారు. రైతులు, కార్మికులు, ఉపాధి హామీ శ్రామికులు, సీనియ‌ర్ సిటిజ‌న్స్‌, దివ్యాంగులు.. ఇలా స‌మాజంలోని ప్ర‌తివ‌ర్గానికి యోగాను చేరువ‌చేసేందుకే థీమ్ యోగాను నిర్వ‌హిస్తున్న‌ట్లు వివ‌రించారు.కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య‌, వీఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ డి.చంద్ర‌శేఖ‌ర్‌, ఆర్‌టీవోలు ఆర్‌.ప్ర‌వీణ్‌, కె.వెంకటేశ్వరరావు, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షులు ఎం.రాజుబాబు, రవాణాశాఖ కానిస్టేబుళ్ల సంఘం అధ్యక్షులు కె.భద్రాచలం (రాజా), ఆటో యూనియన్ నాయకులు, లారీ యూనియన్ నాయకులు, డ్రైవర్లు, రవాణాశాఖ అధికారులు, సిబ్బంది, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, జిల్లా ఆయుష్ యోగాంధ్ర నోడ‌ల్ అధికారి డా. వి.రాణి, ఆయుష్ అధికారి డా. రామ‌త్లేహి, మెడిక‌ల్ ఆఫీస‌ర్ డా. వై.ర‌త్న ప్రియ‌ద‌ర్శిని, వివిధ శాఖ‌ల అధికారులు, విద్యార్థులు, న‌గ‌ర ప్ర‌జ‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here