*ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.* *తేదీ. 06-02-2025.*
రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్.టి.ఆర్. జిల్లా పోలీసులు.
విజయవాడ నగరములో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు సందర్భంగా ది 06-02-2025 తేదిన భవానీపురం ఎస్.డి.యం.వై.ఆర్.ఆర్ హైస్కూల్ నందు ట్రాఫిక్ మీద అవగాహన కల్పించు కార్యక్రమంలో భాగంగా స్కూల్ యాజమాన్యం మరియు వీడు స్వచంద సంస్థ ఆధ్వర్యంలో రోడ్డ్డు భద్రత అవగాహన కయక్రమంలో ఎస్. వి. రాజ శేఖర్ బాబు, ఐ.పి.యస్, ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమీషనర్ వారి ఉత్తర్వులు అనుసరించి, ట్రాఫిక్ DCP ఆదేశాలు, ట్రాఫిక్ ADCP సూచనల మేరకు ఒకటవ ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ పి. శివరామ క్రిష్ణ పాల్గొని రహదారి భద్రత నియమాల గురిచి అనగా ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు విధిగా శిరస్త్రాణం ధరించుట వలన వారి విలువైన ప్రాణములు కాపాడుకోవాలని విన్నవించుచూ, అవగాహన కల్పిస్తూ, రోడ్డు మీద ప్రయాణించే సమయంలో ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు పై ఏర్పాటు చేసిన వేగ పరిమితి, ప్రవేశము నిషిద్దము, పార్కింగ్ నిషేదము, వాహన పార్కింగ్ ప్రదేశము మరియు ఇతర సమాచార సూచిక బోర్డు లను అనుసరించి సురక్షితముగా వాహనములు నడపాలని తెలిపినారు. అదే విధముగా పాఠశాల విద్యార్దులను తీసుకొని వచ్చు వారి తల్లితండ్రులు కూడా విధిగా శిరస్త్రాణం ధరించాలని, సీటు బెల్ట్ ధరించాలని పేరెంట్స్ మీటింగ్ లో తెలియ పర్చవలసినదిగా తెలిపినారు.
అదేవిధముగా నున్న గ్రామంలో అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ IDS రాజు మరియు నున్న శాంతి భద్రతల పోలీస్ స్టేషన్ వారితో కలిసి ఈ రోజు నున్న గ్రామం చెరువు సెంటర్ వద్ద రహదారి భద్రత నిభందనలపై రెడియంట్ పబ్లిక్ స్కూల్ విద్యార్దులకు అవగాహన సదస్సు నిర్వహించినారు. విద్యార్దులకు రహదారిపై ఉండే సమాచార సూచిక బోర్డుల యొక్క ఉపయోగం గురించి, శిరస్త్రాణం ధరించుట వలన కలిగే రక్షణ గురించి మరియు రోడ్డుపై ప్రయాణించినప్పుడు రోడ్డు పై వేయబడిన మార్కింగ్ గుర్తుల గురించి మరియు సిగ్నల్ లైట్స్ ఫంక్షన్ గురించి వివరించినారు. అదే విధముగా పాఠశాల విద్యార్దులను తీసుకొని వచ్చు వారి తల్లితండ్రులు కూడా విధిగా శిరస్త్రాణం ధరించాలని, సీటు బెల్ట్ ధరించాలని పేరెంట్స్ మీటింగ్ లో తెలియపర్చవలసినదిగా తెలిపినారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం వారు మరియు విద్యార్ధులు పాల్గొన్నారు.