Home Crime News రోడ్డు భద్రతపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వద్దు ...

రోడ్డు భద్రతపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వద్దు ఎం వి ఇన్స్పెక్టర్ యం వి ఎన్ రాజు

2
0

27.01.2025- ఆర్టిఓ యూనిట్ కార్యాలయం, జగ్గయ్యపేట

రోడ్డు భద్రతపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వద్దు  

ఎం వి ఇన్స్పెక్టర్ యం వి ఎన్ రాజు

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో చేగు,తపోవన్, లిటిల్ ఏంజెల్స్ ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం నాడు రోడ్డు భద్రత అంశంపై విద్యార్థులతో వ్యాసరచన పోటీలను నిర్వహించారు. దానిలో భాగంగానే విద్యార్థులకు,వారి తల్లిదండ్రులకు, ఉపాద్యాయులకు రోడ్డు భద్రత పట్ల అవగాహన పెంపొందించే విధంగా మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ యంవియన్ రాజు కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ యంవియన్ రాజు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, స్కూళ్లకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు, రోడ్లు దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పిల్లలకు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు చెబుతూ ఉండాలని ఆయన అన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచే విధంగా స్కూళ్లలో విద్యార్థులకు పలు కార్యక్రమాలు చెప్పట్టాలని స్కూళ్ల యాజమాన్యాన్ని కోరారు. కొంతమంది మైనర్ పిల్లలు బైక్ లను నడుపుతున్నారని, వారికి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించినట్లు తెలుస్తుందన్నారు. ఏదైనా జరగారని ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మైనర్ పిల్లలకు వాహనాలను నడపడం చట్టరీత్యా నేరమని, వాహనం నడుపుతూ పట్టుబడితే పిల్లలమీద కేసులు పెట్టడమే కాకుండా వాళ్ల తల్లిదండ్రులపై కూడా కేసులు పెట్టి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూళ్ళ యాజమాన్యం  పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here