*ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ కార్యాలయం విజయవాడ.
రోడ్డు ప్రమాదంలో మరణించిన తమ తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్ధిక సహాయంగా ఒక లక్షా 36 వేల రూపాయలను పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. చేతుల మీదుగా అందించిన ఎన్.టి.ఆర్.జిల్లా 2011 బ్యాచ్ కానిస్టేబుల్స్.
ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 2011 బ్యాచ్ కానిస్టేబుల్స్ వారితోపాటు ట్రైనింగ్ చేసి ప్రస్తుతం కృష్ణా జిల్లా, పమిడిముక్కల పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తూ ది.13.11.2024 తేదిన తెల్లవారుజామున తన భార్యతో కలిసి బైక్ పై ఇంటికి వెళుతున సమయంలో ఆకునూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తమ తోటి కానిస్టేబుల్ మత్తే రామకోటేశ్వర రావు కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించాలనే సదుద్దేశంతో 2011 బ్యాచ్ కానిస్టేబుల్స్ అందరూ కలిసి స్వచ్చందంగా తల కొంత వేసుకుని ఒక లక్షా 36 వేల రూపాయలను సేకరించడం జరిగింది.
ఈ క్రమంలో ఈ రోజు ఆ మొత్తాన్ని నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. చేతులుమీదుగా చనిపోయిన మత్తే రామకోటేశ్వర రావు కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది.
*ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ తోపాటు, ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం. సోమయ్య, 2011 బ్యాచ్ కానిస్టేబుల్స్ మరియు చనిపోయిన కానిస్టేబుల్ మత్తే రామకోటేశ్వర రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు*.
***