రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కి ఎమ్మెల్యే వసంత్ కృష్ణప్రసాదు విజ్ఞప్తి.
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 04.12.2024.
ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన రైతుల సమస్యలపై మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ కి విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ని, ఎమ్మెల్యే కృష్ణప్రసాదు బుధవారం ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా రైతులకు సంబంధించిన సమస్యలతోపాటు, వాటి వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పలు బహిరంగ ప్రయోజనాల గురించి కలెక్టర్ కి సమగ్రంగా వివరించారు. వారి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ అన్నదాతల సమస్యలను ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులతో పాటు గుంటుపల్లి గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.