రేవ్ పార్టీ కేసులో నటి హేమకు నోటీసులు
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఈ నెల 27న విచారణకు రావాలని టాలీవుడ్ నటి హేమకు కర్ణాటక పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఆమె రక్తం నమూనాలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో విచారించాలని పోలీసులు నిర్ణయించారు.
తాను రేవ్ పార్టీలో లేనని బుకాయిస్తూ తొలుత హేమ ఓ వీడియోను విడుదల చేయగా..
బెంగళూరు పోలీసులు ఆమె ఫొటోను రిలీజ్ చేసి, క్లారిటీ ఇచ్చారు.