రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం ఇంద్రకీలాద్రిపై భక్తులకు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సామాన్య భక్తులకు సాఫీగా అమ్మ దర్శన భాగ్యం కల్పించేలా సేవలు అందించాలని అధికారులను ఈ సందర్భంగా మంత్రివర్యులు ఆదేశించారు. భక్తులతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకొని వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.*