రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముకేశ్ కుమార్ మీనా దంపతులు శ్రీ అమ్మవారి దర్శించుకున్న
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:
ఈరోజు అనగా ది.24-06-2024 న రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముకేశ్ కుమార్ మీనా దంపతులు శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా వీరికి ఆలయ ఉప కార్యనిర్వాహనాధికారి గోగినేని లీలా కుమార్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు.
అనంతరం వీరికి వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ ఉప కార్యనిర్వాహనాధికారి వారు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేసినారు.