విజయవాడ,
23-06-2024.
స్వర్గీయ.రామోజీరావు సంస్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించుటకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మాత్యులు కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు.
ఈనెల 27వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం స్వర్గీయ. రామోజీరావు సంస్మరణ కార్యక్రమం
పెనమలూరు మండలంలో తాడిగడప-ఎనికెపాడు 100 అడుగుల రోడ్డులో చైతన్య మహిళా జూనియర్ కళాశాల ఎదుట గల ఖాళీ స్థలంలో ప్రధాన కార్యక్రమం నిర్వహించుటకు చేయవలసిన ఏర్పాట్లపై మంత్రి వివిధ శాఖల రాష్ట్ర ఉన్నతాధికారులతో ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.
సి ఆర్ డి ఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు డీకే బాలాజీ, ఢిల్లీ రావు, కృష్ణ ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, కృష్ణ జిల్లాలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ స్వర్గీయ రామోజీరావు జీవిత విశేషాలు, పత్రికా రంగానికి చేసిన సేవలపై ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంతో పాటు షార్ట్ ఫిలిం ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
మంత్రులు,వివిఐపిలకు చైతన్య మహిళా జూనియర్ కళాశాల ఆవరణ, నాన్ విఐపి లకు, సాధారణ ప్రజానీకానికి వి ఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలలో పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలన్నారు.
శానిటేషన్ తాగునీటి సరఫరా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేయాలన్నారు.
అవసరమైన లైటింగ్ నిరంతర విద్యుత్ సరఫరా పవర్ బ్యాక్అప్ ఏర్పాటు చేయాలని అన్నారు
ప్రధాన వెన్యూ ప్రదేశంలో డయాస్, బ్యారీకేడింగ్ ఆర్ అండ్ బి అధికారులు ఏర్పాటు చేయాలని, ప్రధాన వెన్యూ రహదారులు మరమ్మత్తులు చేయాలన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరు అవ్వనున్న ద్రుష్ట్యా, అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.
వివిఐపీలకు, పబ్లిక్కు గ్యాలరీలు ఏర్పాటుచేసి ప్రతి గ్యాలరీకి ఇన్చార్జి లను నియమించాలన్నారు.
ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రధాన వెన్యూ కు వచ్చే మార్గాలలో తగిన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.
అనంతరం పార్కింగ్ ప్రదేశాలను మంత్రి పెనమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్, ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు.
సి ఆర్ డి ఏ అదనపు కమిషనర్ అలీం బాష , సమాచార శాఖ అదనపు డైరెక్టర్ ఎల్ స్వర్ణలత, జాయింట్ డైరెక్టర్లు కిరణ్ కుమార్, కస్తూరి, సి ఈ మధుసూదన్, ప్రోటోకాల్ అదనపు డైరెక్టర్ వాణి, కృష్ణాజిల్లాలో వివిధ శాఖల అధికారులు, ఉయ్యూరు ఆర్డిఓ డి రాజు తదితరులు పాల్గొన్నారు.