అసెంబ్లీ
తేదీ: 11.11.2024
రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కూటమి ప్రభుత్వం ప్రజా రంజక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది..
ఎన్ని ఇబ్బందులు ఉన్నా, రాష్ట్రం ఆర్థికంగా చిధ్రమైనా కూడా ఎంతో అనుభవజ్ఞులైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు..
ప్రజలు ఎంతో విశ్వాసంతో, పూర్తిగా చిద్రమైన రాష్ట్రాన్ని పట్టా లెక్కిస్తారనే నమ్మకంతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఘనవిజయం అందించారు..
గత ప్రభుత్వం పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడడమే కాకుండా వ్యవస్థలన్నింటినీ నాశనం చేసింది..
గత ఐదేళ్లలో వ్యక్తి కోసం పరిపాలనా? ప్రజల కోసం పరిపాలనా? అన్నట్లు పరిస్థితులు కనిపించిన వైనం..
రాష్ట్ర ఆర్థిక వనరులను, కేంద్ర ప్రభుత్వ నిధులను, సహజ వనరులను దారి మళ్లించారు..
గత ప్రభుత్వంలో ఎక్సైజ్, ఇసుక పాలసీలు పూర్తిగా లోపభూయిష్టం..
గత ప్రభుత్వం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది..
ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చినవి, ఇవ్వనివి కూడా ఈ ఐదు నెలల లోనే అమలు చేసి చూపిస్తోంది..
ఎన్టీఆర్ భరోసా పథకం కింద రూ.3 వేల పెన్షన్ ను రూ.4 వేలకు పెంచడం జరిగింది..
వికలాంగుల పెన్షన్ను రూ.10000 దాకా పెంచడం జరిగింది..
పెన్షన్ను పెంచడానికి గత ప్రభుత్వం నాలుగున్నర ఏళ్ళు తీసుకుంటే కూటమి ప్రభుత్వం ఒక నెలలో పెంచి చూపించింది..
పెన్షన్ల కోసం ప్రస్తుతం నెలకు 4400 కోట్లు ఖర్చు చేస్తున్నారు..
రూ.840 కోట్లతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది..
రైతులకు గత ప్రభుత్వం రూ.1647 కోట్లు ఎగ్గొడితే ఈ ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది..
కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో 2 లక్షల 94 వేల కోట్ల ఆదాయాన్ని చూపించడం జరిగింది..సూ
పర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకానికి రూ. 6000 కోట్లకు పైగా, అన్నదాత సుఖీభవ కు రూ.1000 కోట్లకు పైగా నిధులు కేటాయించడం జరిగింది..
ఈ ఏడాదిలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేయడం జరుగుతుంది..
సబ్ ప్లాన్ లో భాగంగా ఈ బడ్జెట్ లో షెడ్యూల్ కులాలు, తెగలకు, వెనుకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు కూడా నిధులు కేటాయించడం జరిగింది..
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నబిన్నమైతే.. రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ఈ ప్రభుత్వం కొత్తగా పాలసీలను తీసుకురావడం జరిగింది..