12-06-2025
రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యం : ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
ఎన్డీయే కూటమి ఏడాది పాలన పూర్తైన సందర్బంగా అంబరాన్ని అంటిన సంబరాలు
విజయవాడ పార్లమెంట్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు
*సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన
*ఏడాది పాలనలో గత ప్రభుత్వానికి …ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి తేడా గమనించిన ప్రజలు
*అమరావతి లో రాబోతున్న క్వాంటమ్ వ్యాలీ, స్పోర్ట్స్ సిటీ
- కేంద్రం నుంచి రైల్వే ప్రాజెక్టులు, నేషనల్ హైవే నుంచి ఇన్ ఫ్రా ప్రాజెక్టులు తీసుకువచ్చేందుక కృషి
విజయవాడ: గత ఐదేళ్ల విధ్వంసకర పాలనలో గాడి తప్పిన రాష్ట్రాన్ని ఒక ఏడాదిలోనే అభివృద్ధి బాట పట్టించిన సీఎం చంద్రబాబు సొంతం. సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు మరింత చురుగ్గా పనిచేసి వాటిని అధికమిస్తారు. రాష్ట్రంపై ఆర్థిక భారం వున్నా….ప్రతి నెల మొదటి తారీఖు రూ.4వేల రూపాయల పెన్షన్ అందించి ప్రజల సంక్షేమమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని నిరూపించామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు.
ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తైన సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో గురువారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) 11 కేజీల కేక్ కట్ చేసి ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రజల ఆశించినట్లు గా ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభత్వం అని నిరూపించుకుంది. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు. ఏడాది క్రితం జూన్ 12వ తేదీ ప్రారంభమైన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి లో ముందుందన్నారు. ఎన్నికల్లో చెప్పినట్లు అధికారంలోకి రాగానే పెన్షన్ రూ.4 వేలు అందించి సంక్షేమానికి సీఎం చంద్రబాబు పెద్ద పీట వేస్తారని నిరూపించారని కొనియాడారు.
గత ప్రభుత్వానికి ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి తేడాను ప్రజల గమనించారు. గత ప్రభుత్వం ఫించన్ నాలుగేళ్లలో వెయ్యి రూపాయిలు కూడా పెంచకలేకపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంపై ఆర్థిక భారం వున్నా….ప్రతి నెల మొదటి తారీఖు రూ.4వేల రూపాయల పెన్షన్ అందించి ప్రజల సంక్షేమమే ఎన్డీయే కూటమి ధ్యేయం అని నిరూపించుకున్నామన్నారు.
ఎన్నికల్లో చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించమన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా తల్లికి వందనం పథకం అమల్లోకి వచ్చిందన్నారు. ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి రూ.15 వేల చొప్పన తల్లి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయన్నారు.అలాగే
రైతులకు రైతు భరోసా ఈ నెల నుంచే అందించబోతున్నట్లు, ..ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానుందని తెలిపారు.
ఈ ఏడాది పాలనలో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ది కార్యక్రమాలు ఎన్నో చేపట్టినట్లు తెలిపారు. . అమరావతి రాజధాని నిర్మాణ పనులు, పోలవరం ప్రాజెక్ట్ పనులు మొదలైయ్యాయన్నారు.
విశాఖ పట్టణంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సూమారు రూ.6 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావటం జరిగిందన్నారు.. రాష్ట్రానికి ఎన్నో ప్రతిష్టాత్మకమైన సంస్థలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి లో క్వాంటమ్ వ్యాలీ , రాజధాని ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరగనున్నట్లు వివరించారు.
అనంతపురంలో 2014-19 లో కియా పరిశ్రమలు తీసుకురాగా, మళ్లీ ఎన్డీయే కూటమి ప్రభుత్వం లో ఎన్నో ఆటోమొబైల్ పరిశ్రమలు వచ్చాయన్నారు…వీటితో పాటు డిఫెన్స్ పరిశ్రమలు కూడా అనంతపురంకు రాబోతున్నాయని తెలిపారు.. ఇవే కాకుండా నెల్లూరు శ్రీసిటీ సెకండ్ ఫేజ్ మొదలు పెట్టగా, శ్రీ సిటీ, చిత్తూరు లో బహుళ జాతి సంస్థలు రాబోతున్నాయన్నారు. దోనకొండ లో డిఫెన్స్ పరిశ్రమలు రాబోతున్నాయన్నారు.
అలాగే రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేయాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. గోదావరి బనకచర్ల నదుల అనుసందానం చేసి దేశానికి తలమానికంగా రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో చెప్పినట్లుగా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగానే అభివృద్ది కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్లు చెప్పారు.
గత ప్రభుత్వంలో వడ్లు కొనుగోలు చేసిన తర్వాత రైతులకు రెండు మూడు నెలల తర్వాత డబ్బులు పడే పరిస్థితి వుండేది…ఎన్డీయే కూటమిలో 24 గంటల్లో రైతుల ఎకౌంట్స్ లో డబ్బులు పడుతున్నాయన్నారు. ఈ ఏడాది రెండున్నర రేట్లు దిగుబడి పెరిగిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి గింజ కొనాలని, తడి బియ్యం కూడా కొనుగోలు చేయాలని చెప్పటంతో ఆవిధంగా కృషి చేసినట్లు తెలిపారు. మిర్చి రైతులు ధరల కారణంగా ఇబ్బందిపడితే రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ సహాకారంతో మిర్చి రైతులను ఆదుకున్నట్లు వివరించారు..పోగాకు రైతులు ఇబ్బంది పడకుండా తోడ్పాడుగా వుండాలని అధికారులను ఆదేశించటంజరిగిందన్నారు..
ఒక ఏడాదిలో ఇన్ని అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం సీఎం చంద్రబాబు వల్లే సాధ్యమన్నారు. విజయవాడ వరదల సమయంలో సీఎం చంద్రబాబు నగరవాసులకి తోడుగా నిలబడ్డారు. ఆ సమయంలో మరో ముఖ్యమంత్రి వుండి వుంటే ప్రాణనష్టం భారీగా జరిగి వుండటంతో పాటు, పరిస్థితి అదుపు తప్పి వుండేదన్నారు..సీఎం చంద్రబాబు కాకుండా ఆపరిస్థితిని చక్కదిద్దటం మరోకరి వల్ల అయ్యేది కాదన్నారు. సీఎంగా చంద్రబాబు వున్నారనే భరోసాతో ప్రజలు సంతోషంగా వున్నారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ది కోసం కేంద్రం తో మాట్లాడి రైల్వే ప్రాజెక్టులు తీసుకువచ్చేందుకు, నేషనల్ హవే నుంచి ఇన్ ఫ్రా ప్రాజెక్టులు తీసుకువచ్చేందుక కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో మరిన్నీ సంక్షేమ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి 175 నియోజకవర్గాల్లో 175 కి 175 సీట్లు సాధిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ బిల్డింగ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, హుడా మాజీ చైర్మన్ తుమాటి ప్రేమనాథ్, టిడిపి సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎమ్.ఫైజాన్, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు కరీముల్లా, ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, ఎన్టీఆర్ జిల్లా తెలుగుయువత అధికార ప్రతినిధి మాదల హరిచరణ్ (కిట్టు), రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆశా, విజయవాడ అర్బన్ మాజీ ప్రచార కార్యదర్శి కిలారి చంద్రశేఖర్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిశపోగు రాజేష్, టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం, టిడిపి దళిత సీనియర్ నాయకులు కామదేవరాజు, పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతురావు, టిడిపి నాయకులు అబీద్ హుస్సెన్, ఇర్ఫాన్, పామర్తి కిషోర్ బాబు , టిడిపి మహిళ నేతలు సుఖాసి సరిత, నాగమణి, చిట్టా నిర్మల, చెరకురి మాధవి, బుదాల నందకుమారి లతో పాటు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
.