Home Political news రాష్ట్రాభివృద్ధి కోసం రోజుకి 18 గంట‌లు పనిచేసే కార్మికుడు సీఎం చంద్ర‌బాబు : ఎంపి కేశినేని...

రాష్ట్రాభివృద్ధి కోసం రోజుకి 18 గంట‌లు పనిచేసే కార్మికుడు సీఎం చంద్ర‌బాబు : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

3
0

 *01-05-2025*

రాష్ట్రాభివృద్ధి కోసం రోజుకి 18 గంట‌లు పనిచేసే కార్మికుడు సీఎం చంద్ర‌బాబు : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

సిద్దార్ధ‌హోట‌ల్ మేనేజ్మెంట్ కాలేజీ గ్రౌండ్ లో ఘ‌నంగా టి.ఎన్.టి.యు.సి మేడే వేడుక‌లు

ముఖ్యఅతిథిగా హాజ‌రైన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

విజ‌య‌వాడ‌: టిడిపిలో కార్మికుల‌కు, మేడే కి ప్ర‌త్యేకత వుంది. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాపక అధ్య‌క్షుడు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు కార్మిక శ్రామికుల‌ను పార్టీలో భాగం చేశారు. పార్టీ జెండా గుర్తులో ఎన్టీఆర్ చ‌క్రం, నాగ‌లి కార్మిక, కర్ష‌కల‌కు చిహ్నంగా పెట్టారు. ఆయ‌న ఆశ‌యాల‌కు అనుగుణంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాభివృద్ది కోసం ఒక కార్మికుడిలా నిత్యం 18 గంట‌లు పాటు అలుపెర‌గ‌కుండా శ్ర‌మిస్తున్నాడ‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు.

తెలుగునాడు ట్రేడ్ యూనియ‌న్ కౌన్సిల్ (టి.ఎన్.టి.యు.సి) అధ్య‌క్షుడు గొట్ట‌ముక్క‌ల ర‌ఘురామ‌రాజు ఆధ్వ‌ర్యంలో సిద్దార్ధ హోట‌ల్ మేనేజ్మెంట్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మేడే వేడుక‌లు ఎంపి కేశినేని శివ‌నాథ్ హాజ‌రుకాగా, ఇంకా ఈకార్య‌క్ర‌మానికి రాష్ట్రా పార్టీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీనివాస‌యాద‌వ్, మంత్రులు కొల్లు ర‌వీంద్ర‌, వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహ‌న్, స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ చైర్మ‌న్ కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్, రాష్ట్ర అధికార ప్ర‌తినిధులు నాగుల్ మీరా, స‌య్య‌ద్ ర‌ఫీ ల‌తో పాటు త‌దిత‌రులు హ‌జ‌రయ్యారు.

ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ఎన్డీయే కూట‌మి ప్రభుత్వంలో కార్మికుల‌కు ఎప్పుడు భ‌ద్ర‌త వుంటుంద‌ని తెలియ‌జేస్తూ కార్మికు సోద‌రులంద‌రికీ మేడే శుభాకాంక్ష‌లు తెలిపారు. బ్రిటిష్ పాల‌న‌లో కార్మిక శాఖ మంత్రిగా ప‌నిచేసిన డాక్ట‌ర్ అంబేద్క‌ర్ కార్మికుల కోసం 8 గంట‌ల ప‌నిదినంతో పాటు ఎన్నో ప‌ధ‌కాలు కార్మికుల‌కోసం ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది. ఆయ‌న స్పూర్తితో సీఎం చంద్ర‌బాబు నాయుడు అసంఘ‌టిత కార్మికుల కోసం 26 శాఖ‌ల‌తో ఒక ఫెడ‌రేష‌న్ ఏర్పాటు చేస్తే గ‌త ప్ర‌భుత్వం ఆ ఫెడ‌రేష‌న్ ను ర‌ద్దు చేసింద‌న్నారు.. తిరిగి ఆ ఫెడ‌రేష‌న్ ను పున‌రుద్ద‌రించే కార్య‌క్ర‌మం సీఎం చంద్ర‌బాబు చేప‌ట్టార‌ని తెలిపారు.ఈ ఫెడ‌రేష‌న్ వ‌ల్ల అసంఘ‌టిత కార్మికులకి మెడిక‌ల్ ఇన్య్సూరెన్స్, వారి పిల్ల‌ల‌కు విద్య వైద్య వంటి స‌దుపాయాలు ల‌భించే విధంగా కృషి చేశార‌న్నారు. భ‌వ‌న‌నిర్మాణ రంగంలో వున్న అసంఘ‌టిత కార్మికులు గ‌త ప్రభుత్వం ఇసుక ల‌భించ‌క ఇబ్బందులు ప‌డితే ఎన్డీయే కూట‌మి అధికారంలో వ‌చ్చిన త‌ర్వాత సీఎం చంద్ర‌బాబు ఇసుక విధానం అమల్లోకి రావ‌టంతో భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కి ప‌నులు ల‌భిస్తున్నాయ‌న్నారు. మేడే సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో టి.ఎన్.టి.యు.సి జెండాలు రెప‌రెప‌లాడ‌టానికి టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్క‌ల ర‌ఘురామ‌రాజు కృషే కార‌ణ‌మ‌న్నారు. టి.ఎన్.టి.యు.సి బ‌లోపేతం చేయ‌టానికి, గ‌త ప్ర‌భుత్వం దుర్మార్గ పాల‌న‌పై పోరాట చేసే విష‌యంలో ఆరోగ్యాన్ని కూడా ప‌ట్టించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా బ‌స్సు యాత్ర చేశార‌ని కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here