*17.12.2024*
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికన గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్
*పుష్పగుచ్ఛం అందచేసి స్వాగతం పలికిన ఎమ్మెల్యే యార్లగడ్డ*
మంగళగిరి ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) స్నాతకోత్సవం లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డుమార్గన మంగళగిరికి బయలుదేరి వెళ్లారు.