ఎన్టీఆర్ జిల్లా, జూన్ 03, 2025 రాష్ట్రంలో మోడల్ కలెక్టరేట్గా తీర్చిదిద్దుదాం పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిద్దాం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ప్రజలకు పారదర్శకమైన సేవలందించడంతో పాటు పరిపాలన, పచ్చదనం, పరిశుభ్రత వంటి విషయాలపై ప్రత్యేక దృష్టిపెట్టి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ను మోడల్ కలెక్టరేట్గా తీర్చిదిద్దడంలో అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చేపట్టాల్సిన సంస్కరణలు, ప్రాంగణం అభివృద్ధి, పచ్చదనం పరిశుభ్రతపై మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పురాతన కాలం నాటి కట్టడమైన కలెక్టరేట్ భవనం సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటోందన్నారు. ఒకప్పటి సబ్ కలెక్టర్ కార్యాలయం ఏర్పడి నూరు వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భగా ఏర్పాటుచేసిన స్తూపం సమాచారాన్ని ప్రజలకు మరింత తెలియజేసేలా రంగులతో తీర్చిదిద్ది అలంకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్తూపం చుట్టూ ఉన్న స్థలంలో ఔషధ మొక్కలు నాటి, సంరక్షించి, అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యంగా కలెక్టరేట్ను సందర్శించే ప్రజలకు అర్థమయ్యేలా విభాగాలు, అధిపతులకు దారిచూపుతూ సూచిక బోర్డులను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన ద్వారం వద్ద కలెక్టరేట్కు సంబంధించిన లేఅవుట్ బోర్డును ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే కలెక్టరేట్ ప్రాంగణంలో నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు వృక్షాలకు సంబంధించిన పేర్లతో కూడిన బోర్డులను ఏర్పాటుచేయాలన్నారు. ఆవరణలో ఎక్కడా వర్షపు నీరు నిలిచిపోకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు ఆవరణలో పచ్చదనం ఉట్టిపడేలా మొక్కలు నాటాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ వాడకుండా చూడాలని, దీనికి సంబంధించి ప్రజలను చైతన్యవంతులను చేసేలా చర్యలు తీసువాలన్నారు. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ మిగిలిన జిల్లాలకు ఆదర్శవంతంగా ఉండేలా అభివృద్ధి చేయాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, ఏవో ఎస్.శ్రీనివాస్రెడ్డి, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
Home Andhra Pradesh రాష్ట్రంలో మోడల్ కలెక్టరేట్గా తీర్చిదిద్దుదాం పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిద్దాం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ప్రజలకు