రాష్ట్రంలో జైనులను గౌరవించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్
–జైనులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక రూపాల్లో మేలు చేసింది
రాష్ట్రంలో జైనులను గుర్తించి వారికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్ధి షేక్ ఆసిఫ్గారు అన్నారు.
ఏపీ జైన్ అభివృద్ధి, సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ మనోజ్కొఠారిగారు ఆధ్వర్యంలో రాజస్థానీయుల ఆత్మీయ సమ్మేళనం ఎస్ఆర్ ఫంక్షణ్ హాల్లో ఆదివారం నగరంలో జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హజరైన ఆసిఫ్గారు మాట్లాడుతూ జైనులను గుర్తించి వారికి ప్రత్యేకంగా దేశంలోనే మొదటిగా ఏపీ జైన్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
దేశంలో కులమతాలకు అతీతంగా పేదరికమే ప్రాతిపదికను అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి పేదరిక నిర్మూలనకు పాటుపడిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి అన్నారు. అటువంటి ముఖ్యమంత్రిని మరోసారి ఎన్నుకోవాల్సిన అవసరాన్ని, అవశ్యకతను అందరూ గుర్తించాలన్నారు.
జైనులు ఇతర రాజస్థానీయులు విజయవాడ నగరంలో అనేక దశాబ్ధాలుగా స్థిర నివాసం ఏర్పరచుకొని అన్నదమ్ముల్లా జీవిస్తున్నారన్నారు. శాంతియుత జీవితాలను అందరం గడుపతున్నామన్నారు. అటువంటి చక్కని శాంతియుత జీవనం కావాలంటే మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.
తాను కార్పొరేటర్గా, ఏపీ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్గా పని చేశానని, జగన్మోహన్రెడ్డి తన విధేయతను చూసి ఎమ్మెల్యే సీటును ఇచ్చి గౌరవించాడని చెప్పారు. స్థానికుడునైన తాను ఎమ్మెల్యేగా అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు.
ఆంధ్రా మాల్యా సుజనాచౌదరి ప్రజలను దోచుకోవటానికి మాత్రమే ఇక్కడ పోటీ చేస్తున్నారని అటువంటి వ్యక్తులను తరిమికొట్టాలని చెప్పారు.
ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతగారు మాట్లాడుతూ తన తండ్రి నాని పదేళ్లగా ఎంపీగా ఉంటూ విజయవాడ పార్లమెంట్ పరిధిలో సుమారు ఎనిమిది వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. అలాగే జైనులు ఇతర రాజస్థానీయులకు తాము అండగా ఉంటామన్నారు. రానున్న ఎన్నికల్లో కేశినేని నాని, ఆసిఫ్లను గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సభకు అధ్యక్షత వహించిన ఏపీ జైన్ కార్పొరేషన్ ఛైర్మన్ మనోజ్కొఠారిగారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని జైన్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి తమను గౌరవించిన జగన్కు తామందరం అండగా ఉంటామన్నారు.
ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో జైన్ కార్పొరేషన్ల కోసం అక్కడ ఉన్న జైనులు అక్కడి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు.
మహావీర్ భగవానుడికి, జైనులకు అనేక రూపాల్లో మేలు చేసి తమను గత ప్రభుత్వాలకు భిన్నంగా ఆదరించి అక్కున చేర్చుకున్నారని వివరించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీగారు, ఏపీ ఇండస్ట్రియల్ డవలప్మెంట కార్పొరేషన్ ఛైర్మన్ బండి పుణ్యశీలగారు, జిల్లా వక్ఫ్బోర్డు ఛైర్మన్ షేక్ గౌస్మొహిద్దీన్గారు, కార్పొరేటర్లు మండేపూడి ఛటర్జీగారు, మహాదేవు అప్పాజీరావుగారు, నాయకులు హాయత్గారు, కర్రి గౌరిగారు తదితరులు పాల్గొన్నారు.