రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణావిక్రయాలపై ఉక్కుపాదం మోపుతాము.
జిందాల్ అర్బన్ మేనేజ్మెంట్ నందు గంజాయి దగ్ధం.
రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్.
చిలకలూరిపేట: కృష్ణా జిల్లాలోని నాలుగు సబ్ డివిజన్ ల పరిధిలో 183 కేసులలో పోలీసులు సీజ్ చేసిన 3,737 కిలోల గంజాయి, 4.22 కిలోల లిక్విడ్ గంజాయినిజిందాల్ అర్బన్ మేనేజ్మెంట్ నందుదగ్ధం చేయడం జరిగిందని డిజిపి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.గంజాయి అక్రమ రవాణా నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలిపారు.ఈగల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి గంజాయి ముఠాలపై నిఘా పెట్టడం జరిగిందని తెలిపారు.గంజాయి రవాణా చేస్తున్న వారి మీద కేసులతో పాటు వారి ఆస్తులను సీజ్ చేస్తున్నట్లు అన్నారు.
మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలలో ప్రజలకు మరియు విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా నియంత్రణలో ఉన్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డిజిపి హరీష్ కుమార్ గుప్తా తో పాటు ఈగల్ ఐజిపి ఆకే. రవి కృష్ణ ఐపీఎస్, ఏలూరు రేంజ్ ఐ.జి జీ.వి.జి అశోక్ కుమార్ ఐపీఎస్,ఈగల్ ఎస్పీకె. నగేష్ కుమార్ , కృష్ణా జిల్లా ఎస్పీ కె. గంగాధర్ రావు , పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుతోపాటు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.