రాయల్ హోటల్ సెంటర్లో పర్యటించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ పశ్చిమ జులై 1
లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందచేయడం జరుగుతుందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు సోమవారం వన్ టౌన్ రాయల్ హోటల్ సమీప ప్రాంతంలో సుజనా చౌదరి పర్యటించారు
ఈ పర్యటన లో స్థానికులతో ఆయన మాట్లాడి సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయగలరని పేర్కొనడం జరిగింది.
ఇదే సందర్భంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేత ఎంఎస్ బేగ్, ఎన్డీఏ యువ నాయకులు పోతిన అవినాష్, దొడ్ల రాజా , అనిల్ తదితరులు పాల్గొన్నారు.