04.12.2024- విజయవాడ
రద్దు చెయ్యాలి- సీపీఎస్ విధానాన్ని
సీపీఎస్ విధానాన్ని రద్దు చెయ్యాలని కోరుతూ ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల *10న చలో విజయవాడ* నిరసన కార్యక్రమంను విజయవంతం చెయ్యాలని కోరుతూ రూపొందిన పోస్టర్ ను విజయవాడ రవాణాశాఖ కార్యాలయంలోని ఉద్యోగులు మద్యాహ్నం భోజన విరామ సమయంలో పోస్టర్ ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏపీ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం, జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు మాట్లాడుతూ సీపీఎస్ విధానంలో పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు పదవి విరమణ పొందినాక అనేక ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నారని, పూర్తి పెన్షన్ లేక కుటుంబం గడవటానికి కూడా చాలా బాధలకు గురవుతున్నారని అన్నారు. ఇకనైనా సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు పూర్తి పెన్షన్ అందేవిధం చెయ్యాలని ఆయన కోరారు.
ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి సీఎం దాసు మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ గతంలో అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగిందని, సీపీఎస్ రద్దు చేసేవరకు ఈ ఉద్యమాలు చేస్తూనే ఉంటామని అన్నారు. ఈనాడు కూటమి ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు మంచి చేస్తాదనే ఆశ భావంతో ఉద్యోగులు ఉన్నారని ఆయన అన్నారు. *ఈ నెల 10వ తారీఖున తలపెట్టిన చలో విజయవాడ* నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాద్యాయులు పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు అర్జ నాగరాజు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కె ప్రభాకర్, రవాణాశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.