ఎన్టిఆర్ జిల్లా
తేది: 13.06.2025
యోగ సాధనతో శారీరకంగా మరింత శక్తివంతం.
పరిశ్రమల్లో ‘‘వర్క్ బిఫోర్ యోగ’’ అమలు చేయండి
యోగ సాధన ప్రయోజనాలను అందరికీ తెలియజేద్దాం.
మహిళా పారిశ్రామికవేత్తల యోగ సాధన అభినందనీయం.
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు యోగ సాధన ద్వారా శారీరకంగా మరింత శక్తి లభిస్తుందని పరిశ్రమలలో పనికి ముందు కొంత సమయం యోగాసనాలకు కేటాయించేలా పారిశ్రామికవేత్తలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మిశ అన్నారు.
యోగాంధ్ర మాసోత్సవంలో భాగంగా శుక్రవారం బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో మహిళా పరిశ్రమికవేత్తలతో కలిసి జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ యోగాసనాలలో పాల్గొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ వారసత్వ సంపద అయిన యోగాసనాల సాధనను నేడు ప్రపంచమంతా అనుసరించడం మన దేశానికి గర్వకారణమన్నారు. యోగా సాధన ద్వారా శరీరానికి మరింత శక్తి చేకూరుతుందన్నారు. యోగాంధ్ర మాసోత్సవంలో భాగంగా గత 24 రోజులుగా వివిధ వర్గాల వారిని భాగస్వాములను చేసి వారి ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ మండలాలు పట్టణాలలో శిక్షకులతో యోగాసనాలను సాధన చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు ప్రతి రోజు కనీస సమయాన్ని యోగ సాధనకు కేటాయించేలా పారిశ్రామికవేత్తలు చర్యలు తీసుకుని, యోగాను ప్రోత్సహించేందుకు ముందుకు రావాలన్నారు. రుగ్మతల నుంచి రక్షణ పొందేందుకు యోగాసనాలను ఆచరించడం ఉత్తమ మార్గంగా కార్మికులు ఎంచుకోవాల్సిన అవసరముందన్నారు.మనసును లగ్నం చేసి యోగా శిక్షకుల సూచన మేరకు ఆసనాలను ఆచరించడం ద్వారా మనసును, శరీరాన్ని ఆధీనంలో ఉంచుకొని దృఢత్వం పొందేందుకు కార్మిక సోదరసోదరీమణులు కృషిచేయాలన్నారు.
ప్రతిఒక్కరూ దిన చర్యలలో యోగా సాధన భాగంగా చేసుకోవాలన్నారు. ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో మానసిక ఒత్తిడితో పాటు శరీరక శ్రమ ఆధికమై అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. రోజువారి జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని యోగా సాధన ద్వారా అధిగమించవచ్చునని.. ఇది పరిశోధనల్లో తేలిందని యోగా సాధన శరీరానికి నూతన శక్తిని ఇస్తుందన్నారు. రుగ్మతుల నుండి రక్షణ పొంది ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకునేందుకు యోగాసనాల సాధనే ప్రధానమన్నారు. భారతదేశ వారసత్వ, సాంస్కృతిక సంపద అయిన యోగాను నేడు ప్రపంచంలోని అనేక దేశాలు అనుసరిస్తున్నాయన్నారు. జూన్ 21 నాటికి ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగాసనాలు నేర్పించేందుకు జిల్లా యంత్రాంగం 5 వేల మంది శిక్షకులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ప్రతి గ్రామం, మండలం, పట్టణం, నగరాల్లో వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే వేదికలు సిద్ధంచేసినట్లు వివరించారు. నిత్యం శారీరక శ్రమతో సతమతమయ్యే కార్మికులకు యోగాసనాలు దివ్య ఔషధం వంటివని, ఆసనాలను ఆచరించి నూతనోత్సాహం పొందడం ద్వారా మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ తెలిపారు.
కార్యక్రమంలో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రన్యూర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎలిప్) కార్యదర్శి కె. కనకదుర్గా, ఫెడరేషన్ అఫ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షులు వి. మురళికృష్ణ, దళిత్ ఇడియన్ ఇండస్ట్రీస్ ఛాంబర్ ఆఫ్ కామార్స్ జిల్లా కో`ఆర్డినేటర్ రాజామణి, జెఆర్డి టాటా అసోసియేషన్ చైర్మన్ వినోద్, ఇండస్ట్రీస్ జిఎం బి. సాంబయ్య, ఏపి ఎస్ఐసి జోనల్ మేనేజర్ బాబ్జి, డిఆర్డిఏ పిడి నాంచారయ్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇఇ శ్రీనివాసరావు, డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని, జిల్లా ఆయుష్ యోగాంధ్ర నోడల్ అధికారి డా. వి.రాణి, ఆయుష్ అధికారి డా. రామత్లేహి, ఎన్టిఆర్ వైద్య సేవా ట్రస్ట్ జిల్లా కో`ఆర్డినేటర్ డా. జె.సుమన్, డా. రత్నప్రియదర్శిని, యోగా శిక్షకులు సత్యనారాయణ ఎన్ఎస్ఎస్ కో`ఆర్డినేటర్ యుగేందర్ పాల్గొన్నారు.