ఎన్టిఆర్ జిల్లా
తేది: 17.06.2025
యోగాసనాలతో నిత్య యవ్వనం నూతనోత్సహం.
యోగాసనాలను ప్రజలకు చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం
అందరికీ ఆరోగ్యం... వికసిత్ భారత్ లక్ష్యం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
యోగాసనాలతో ప్రతి ఒక్కరూ నిత్య యవ్వనంతో నూతనోత్సహాన్ని పొందడం ద్వారా ఆరోగ్యవంతులుగా జీవించగలుగుతారని యోగాసనాలను ప్రజలకు చేయాలన్నదే పభుత్వ ఉద్దేశమని, శతాబ్దాల క్రితం భారతదేశం యోగాసనాలకు కేంద్ర బిందువు అని తదనంతర కాలంలో కనుమరుగైన యోగాభ్యాసం ‘‘యోగాంధ్ర’’ పేరుతో తిరిగి పునరుజ్జీవింప చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా యోగ మాస ఉత్సవాలను నిర్వహిస్తున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు.
యోగాంధ్ర మాసోత్సవాలలో భాగంగా మంగళవారం బి ఆర్ టి ఎస్ రోడ్డులోని యోగా స్ట్రీట్ నందు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా 202, వాకర్స్ క్లబ్, జూనియర్ చాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ యోగాసనాల ద్వారా శరీరక మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారన్నారు. రక్తపోటు, మధుమేహం, కండరాలు, మోకాళ్ల నొప్పులు, స్త్రీలకు సంబంధించిన రుగ్మతుల నుండి యోగాసనాల ద్వారా రక్షణ పొందవచ్చునన్నారు. యోగాసనాలను ప్రజల జీవన శైలిలో ఒక భాగంగా చేసేందుకు యోగాంధ్ర కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. ఒక మంచి కార్యక్రమని ప్రజలు స్వీకరించేందుకు కొంత సమయం పట్టినప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. ప్రతిరోజు యోగ స్ట్రీట్ లో వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో యోగాసనాలపై అవగాహన కల్పిస్తున్నామని వారి ద్వారా మరి కొంత మందిని చైతన్యవంతులను చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో 10 లక్షల మంది యోగాసనాలను ఆచరించాలనే లక్ష్యంతో గ్రామ మండల పట్టణలలో ప్రతి రోజు యోగాసనాలపై శిక్షణ అందిస్తున్నామన్నారు. ఇందుకు 5 వేల మంది శిక్షకులను ఏర్పాటు చేసిన్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
వాకర్ ఇంటర్నేషనల్ పూర్వపు గవర్నర్ టి. హనుమంతరావు మాట్లాడుతూ పతంజలి మహర్షి భారతదేశానికి అందించిన గొప్ప వరమే ఈ యోగ విద్య అన్నారు. మనిషి బతికినంత కాలం ఆరోగ్యంగా ఉండాలంటే యోగాసనాలను మించిన ఔషధం లేదన్నారు.సర్వరోగనివరణకు తోడ్పడే యోగాసనాలు ప్రాణామయంలను నిత్యం అచరిస్తే ధీర్ఘాయుషులుగా జీవిస్తారన్నారు.
జూనియర్ చాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి జె. శివ మాట్లాడుతూ యోగాసనాల ద్వారా లభించే మానసిక శక్తి మంచి ఆలోచనలకు దోహదపడుతుందన్నారు. మాసోత్సవాలలోనే కాకుండా యోగా స్ట్రీట్లో ప్రతి రోజు యోగాసనాలపై శిక్షణ ఇచ్చేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు.
సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వేమూరి బాబురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారతదేశ జీవన విధానంలో ఒకనాడు యోగాసనాలు చాలా ప్రాముఖ్యత కలిగి ఉండేవన్నారు. భారతీయ సమాజంలో తిరిగి అటువంటి సంస్కృతి నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ప్రతి పౌరుడు నిత్యం యోగాసనాలు వేసేలా ప్రోత్సహించాలన్నారు.
కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా 202 పూర్వపు గవర్నర్ అమర్నాథ్, గవర్నర్ ఎ. విజయలక్ష్మీ, కార్యదర్శి పి. పుష్పలత, కోశాధికారి టి. బాలాజీ, జెసిఐ ప్రతినిధులు కె. రాజేంద్రరెడ్డి, కె. గణేష్బాబు, జె. స్వాతి, దత్తాత్రేయ యోగా క్లబ్ ప్రతినిధులు డి. తిరుపతిరాజు, రఘు స్వామిజీ, నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ చంద్రశేఖర్, డిఎంఅండ్హెచ్వో డా. యం. సుహాసిని, ఎన్టిఆర్ ఆరోగ్య సేవా ట్రస్ట్ కో`ఆర్డ్నేటర్ డా. జె. సుమన్, యోగా శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.