Home Andhra Pradesh యోగాతో అన్న‌దాత‌కు ఆరోగ్య సిరుల పంట‌ యోగా, ధ్యానంతో శారీర‌క ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యం...

యోగాతో అన్న‌దాత‌కు ఆరోగ్య సిరుల పంట‌ యోగా, ధ్యానంతో శారీర‌క ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యం బీఆర్‌టీఎస్ యోగా స్ట్రీట్‌లో

4
0

ఎన్‌టీఆర్ జిల్లా, మే 31, 2025 యోగాతో అన్న‌దాత‌కు ఆరోగ్య సిరుల పంట‌ యోగా, ధ్యానంతో శారీర‌క ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యం బీఆర్‌టీఎస్ యోగా స్ట్రీట్‌లో విజ‌య‌వంతంగా రైతున్న‌ల థీమ్ యోగా రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ డైరెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు, జిల్లా క‌లెక్ట‌ర్ జి.ల‌క్ష్మీశ‌*ఆరుగాలం శ్ర‌మించి దేశానికి అన్నం పెడుతున్న అన్న‌దాత‌లు శారీర‌క ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకొని ఆరోగ్య సిరుల పంట‌ను పొందేందుకు యోగా, ధ్యాన సాధ‌న‌ను త‌మ జీవితంలో భాగం చేసుకోవాల‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ డైరెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు, క‌లెక్ట‌ర్ జి.ల‌క్ష్మీశ అన్నారు. ఆయుష్‌శాఖ‌, ఎన్‌టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ సంయుక్త ఆధ్వ‌ర్యంలో శ‌నివారం విజ‌య‌వాడ బీఆర్‌టీఎస్ యోగా స్ట్రీట్‌లో నిర్వ‌హించిన రైత‌న్న‌ల థీమ్ యోగా యోగా కార్య‌క్ర‌మంలో వ్య‌వ‌సాయ శాఖ డైరెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు, జిల్లా క‌లెక్ట‌ర్ జి.ల‌క్ష్మీశ‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర హెచ్ఎం త‌దిత‌రులు పాల్గొని రైతుల‌తో క‌లిసి యోగాసనాలు అభ్య‌సించారు.ఈ సంద‌ర్భంగా డిల్లీరావు మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి చొర‌వ‌తో భార‌తీయ వార‌స‌త్వ సంప‌ద అయిన యోగా అనేక దేశాల‌కు చేరువ అయింద‌ని.. ప్రపంచవ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్య‌క్ర‌మాలు 2015, జూన్ 21న జ‌రిగాయ‌ని, ఈ ఏడాది అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వ ప్ర‌త్యేక వేడుక‌లు మ‌న రాష్ట్రంలోని విశాఖ‌లో జ‌ర‌గ‌నుండ‌టం మనంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. యోగాంధ్ర మాసోత్స‌వాల్లో భాగంగా స‌మాజంలోని ప్ర‌తివ‌ర్గానికి యోగాను చేరువ‌చేయాల‌నే ఉద్దేశంతో థీమ్ యోగా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డం ఆనందంగా ఉంద‌ని, వీటిని ప్ర‌తిఒక్క‌రూ స‌ద్వినియోగం చేసుకొని యోగాను జీవితాంతం ఆచ‌రించాల‌ని సూచించారు. రైత‌న్న‌లు త‌మ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవ‌డం ద్వారా మానసిక ఆరోగ్యం ప‌రిపుష్ట‌మ‌వుతుంద‌న్నారు. ధ్యాన సాధ‌న‌, ప్రాణాయామం వంటి వాటిని ఆచ‌రించాల‌ని డిల్లీరావు సూచించారు.*11వ రోజు అన్న‌దాత‌ల‌తో యోగాంధ్ర విజ‌య‌వంతం: క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*11వ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వ యోగాంధ్ర మాసోత్స‌వాల్లోని 11వ రోజు కార్య‌క్ర‌మాన్ని అన్న‌దాత‌ల‌తో క‌లిసి నిర్వ‌హించ‌డం చాలా ఆనందం క‌లిగించింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. హ‌ల‌మే బ‌ల‌మై స్వేదం చిందించి సేద్యం చేసే అన్న‌దాత‌లు దేహ దారుఢ్యంతో పాటు మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను చేకూర్చే యోగాకు చేరువ‌కావాల‌ని సూచించారు. యోగాంధ్ర‌లో భాగంగా ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌తో పాటు ప్ర‌తి గ్రామం, ప్ర‌తి ప‌ట్ట‌ణంలోనూ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని, బీఆర్‌టీఎస్ యోగా స్ట్రీట్‌లో థీమ్ యోగా కార్య‌క్ర‌మాలు విజ‌య‌వంతంగా ముందుకు సాగుతున్నాయ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు.కార్య‌క్ర‌మంలో డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, జిల్లా ఆయుష్ యోగాంధ్ర నోడ‌ల్ అధికారి డా. వి.రాణి, ఆయుష్ అధికారి డా. రామ‌త్లేహి, జిల్లా వ్య‌వ‌సాయ అధికారి డీఎంఎఫ్ విజ‌య‌కుమారి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ అద‌న‌పు క‌మిష‌న‌ర్ డి.చంద్ర‌శేఖ‌ర్‌, డా. జె.సుమ‌న్‌, డా. ర‌త్న‌ప్రియ‌ద‌ర్శిని, రైతులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here