యువత సవాళ్లను స్వీకరించాలి
ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్
నేటితరం యువత సవాళ్లను స్వీకరించడానికి ముందుకు రావాలని ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ సూచించారు.
భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరిశ్రీరామ్, మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య , ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
అడ్డూరి శ్రీరామ్ జాతీయ జండాను ఆవిష్కరించారు . అనంతరం మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సమిష్టిగా విజయం సాధించడం శుభ పరిణామం అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమంలోని మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ విద్యా , వైద్యం ఉద్యోగ రంగాలలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చి అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తున్నారని అన్నారు. ప్రధాని మోడీ పాలన దేశం గర్వించేలా ఉందని 2047 నాటికి ప్రపంచంలో పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఉండాలనేది ఆయన సంకల్పం అన్నారు.
స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్ ను ఏర్పాటు చేశారన్నారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ ను ఎన్నుకోగా రాజ్యాంగం ముసాయిదా కమిటీ చైర్మన్ గా డాక్టర్ బి అర్ అంబేద్కర్ ను నియమించారని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల 11 నెలల, 18 రోజులు కాలం పట్టిందని గుర్తు చేశారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు, బాధ్యతలు విస్మరించకూడదని యువత సవాళ్లను స్వీకరించడానికి ముందుకు రావాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నేతలు బోగవల్లి శ్రీధర్, సోమేశ్వరరావు, పైలా సురేష్, దుర్బేసుల హుస్సేన్, దాడి అప్పారావు, పగడాల కృష్ణ, పల్లె పోగు ప్రసాద్, వేరుకొండ ఉమాకాంత్, దేవిన హరిప్రసాద్, నాగల హరికిషోర్, దొడ్ల రాజా, దాడి మురళీకృష్ణ, పచ్చవ మల్లికార్జున, మహేష్, భాను, బ్రహ్మారెడ్డి, గడ్డిపాటి కిరణ్, దుర్బెసుల మీరావలి, బొగ్గవరపు సత్యనారాయణ, సత్య సాయి ప్రసాద్, వేంపల్లి గౌరీ శంకర్, బొమ్ము రాంబాబు, సమ్మెట రాజా నాయుడు, మంతాపురం రాజేష్, గన్ను శంకర్, రౌతు రమ్యప్రియ తదితరులు పాల్గొన్నారు.