మోసపూరితంగా గృహాలలో ఆదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడానికి ప్రయత్నాలు
ప్రభుత్వ అండతో ప్రతి ఇంటిలో అదానీ దోపిడీకి ఆస్కారం కలిగిస్తున్న పాలకులు
విజయవాడలో నిరుపేద వృద్ధురాలి ఇంటికి స్మార్ట్ మీటర్ బిగింపు
ప్రజా ఆందోళనతో పెట్టిన మీటర్ ను తొలగించిన అదాని సిబ్బంది
రాష్ట్రంలో పలుచోట్ల స్మార్ట్ మీటర్ల పై ప్రజాగ్రహం, మీటర్లను ధ్వంసం చేస్తున్న ప్రజానీకం
విజయవాడలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వృద్ధురాలికి, ప్రజలకు అభినందనలు తెలిపిన బాబురావు
స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా కండ్రిక కాలనీలో పాదయాత్ర నిర్వహించిన బాబురావు, సిపిఎం నేతలు
విజయవాడ, 64 డివిజన్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్( కండ్రిక కాలనీ)లో 75 సంవత్సరాల వృద్ధురాలు రాజ్యలక్ష్మి ఏనాడో ప్రభుత్వం కేటాయించిన చిన్న ఇంటిలో నివసిస్తున్నది.
- ఈ గృహం స్లాబ్ దెబ్బతినిని కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నది, బిక్కు బిక్కుమంటూ వృద్ధురాలు ఒకరే నివాసం ఉంటున్నారు.
- మీటర్ పనిచేయడం లేదనే సాకుతో అదానీ కంపెనీ సిబ్బంది మోసపూరితంగా వృద్ధురాలు ఇంట్లో పాత మీటర్ తొలగించి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ను బిగించారు.
- సమాచారం తెలుసుకున్న స్థానిక సిపిఎం కార్యకర్తలు. స్మార్ట్ మీటర్ ప్రమాదాన్ని వివరించగా రాజ్యలక్ష్మి, ఇతర స్థానిక ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
- సిపిఎం కార్యకర్తలు, స్థానికులతో కలిసి రాజ్యలక్ష్మి ఆందోళన నిర్వహించారు. అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు.
- ప్రజా ఆందోళన ఫలితంగా ఆదానీ సిబ్బంది స్మార్ట్ మీటర్ ను తొలగించక తప్పలేదు. మళ్లీ పాత డిజిటల్ మీటర్ ని బిగించారు.
- సమాచారం తెలుసుకున్న అనంతరం నేడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు నేడు కండ్రిక కాలనీలో పర్యటించి, స్మార్ట్ మీటర్ కు వ్యతిరేకంగా పోరాడిన వృద్ధురాలైన రాజ్యలక్ష్మిని, స్థానిక ప్రజలను అభినందించారు. రాజ్యలక్ష్మి గృహాన్ని సందర్శించారు.
- కాలనీలో బాబురావు సిపిఎం కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో పర్యటించి స్మార్ట్ మీటర్ల పై ప్రజలను చైతన్యపరిచారు. కరపత్రాలు పంపిణీ చేశారు. సమావేశాలు నిర్వహించారు.
- ఉమ్మడిగా స్మార్ట్ మీటర్లను అడ్డుకోవటానికి స్థానిక ప్రజలు నిర్ణయించుకున్నారు.
ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.
కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తయిన సందర్భంలో తొలి అడుగు పేరుతో సంబరాలు చేస్తోంది.
విద్యుత్ విషయంలో కూటమి ప్రభుత్వం తొలి అడుగులోనే తప్పటడుగు వేసింది.
వైసీపీ బాటలోనే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ప్రతి ఇంటిలో అదానీ దోపిడీకి ఆస్కారం కలిగించే విధంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగిస్తోంది.
శాశ్వతంగా ఆదానీ సంస్థ దోపిడీకి ప్రజలను బంధిఖానా చేస్తోంది.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ఆదేశాలకు లొంగిపోయి గత వైసిపి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లకు ఒప్పందాలు చేసుకున్నది. అదాని సంస్థకు టెండర్లను కట్టబెట్టింది, భారీ కుంభకోణానికి పాల్పడింది.
ఆనాడు స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చిన టిడిపి కూటమి నేతలే నేడు మీటర్లను బిగించాలని ఆదేశాలు ఇవ్వటం దుర్మార్గం.
స్మార్ట్ మీటర్ల ఒప్పందాలను రద్దు చేయాల్సిన కూటమి ప్రభుత్వం వాటిని కొనసాగించడం నమ్మకద్రోహం
రాష్ట్రంలోని రెండు కోట్ల మంది వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు.
తొలి దశలో కార్యాలయాలకు, ఆ తర్వాత షాపులకు బిగించి, నేడు నివాస గృహాలకు స్మార్ట్ మీటర్లను పెట్టడం మోసపూరితం.
ఎక్కడికక్కడ ప్రజలు చైతన్యవంతులై స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తున్నారు.
అదానీ సిబ్బంది.. ప్రభుత్వ అండతో గుట్టు చప్పుడు కాకుండా, వినియోగదారుల అనుమతి లేకుండా, మోసపూరితంగా మీటర్లు బిగిస్తున్నారు.
కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లకు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు రిపేర్ల పేరుతో పాత మీటర్లను తొలగించి, ప్రజల కళ్ళుగప్పి స్మార్ట్ మీటర్లను బిగించడం దుర్మార్గం.
సొంత యజమానులు లేని సందర్భాలలో కల్లబొల్లి కబుర్లు చెప్పి మీటర్లు మార్చేస్తున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. బలవంతంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు.
ప్రీ పేయిడ్ మీటర్ల వల్ల సామాన్యులు మొదలు అందరిపై అధిక భారం పడుతుంది.
మీటర్లకు అయ్యే ఖర్చు10 నుండి 17వేల రూ.. దశలవారీగా వినియోగదారులపైనే మోపుతారు.
అధిక విద్యుత్ వినియోగించే సమయాలలో అధిక రేట్లు నిర్ణయించి వసూలు చేస్తారు.
వైర్లెస్ టెక్నాలజీ ద్వారా మీటర్లను రిమోట్ ద్వారా అదానీ సంస్థ నియంత్రణ చేస్తుంది, రీడింగ్ తియ్యరు, బిల్లులు ఆన్లైన్లో పంపుతారు, బిల్లులకు జవాబుదారితనం ఉండదు.
10 సంవత్సరాలపాటు నిర్వహణను అదాని సంస్థకు కట్టబెట్టడంతో క్రమంగా విద్యుత్ పంపిణీ ఆదానీ పరం కాబోతున్నది.
రాష్ట్రాన్నీ, విద్యుత్ రంగాన్ని ఆదానికి.. పాలకులు కట్టబెడుతున్నారు.
విద్యుత్ దోపిడీ, అదానీ స్మార్ట్ మీటర్లు, సోలార్ విద్యుత్ ఒప్పందాలు, విద్యుత్ భారాల విషయాలలో బిజెపి, టిడిపి, జనసేన, వైసిపి పార్టీలు ఒకే దారిలో నడుస్తున్నాయి.
విద్యుత్ విషయంలో వీరందరూ దోషులే, అదానీ స్మార్ట్ మీటర్లకు వీరందరూ బాధ్యులే
అందుకు దీనికి వ్యతిరేకంగా ప్రజలే ఉద్యమించాలి. సిపిఎం, వామపక్షాలు, ప్రజా సంఘాలు విద్యుత్ రంగంలో కార్పొరేట్ల దోపిడీ, స్మార్ట్ మీటర్ల ప్రమాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.
ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు, స్మార్ట్ మీటర్ల పై ప్రతిఘటన పెరిగింది.
ఇప్పటికే నంద్యాల జిల్లా బేతంచెర్ల ,కృష్ణా జిల్లా గుడివాడ తదితర ప్రాంతాలలో స్మార్ట్ మీటర్లను బలవంతంగా బిగిస్తుండగా ప్రజలు ప్రతిఘటించారు. స్మార్ట్ మీటర్లను పగలగొట్టారు. ప్రజాగ్రహాన్ని వ్యక్తం చేశారు
గుంటూరులో సుందరయ్ కాలనీలో 50 గృహాలకు స్మార్ట్ మీటర్లు పెట్టగా, తొలగించే వరకు పోరాడారు. మళ్లీ పాత మీటర్లు బిగించారు.
నేడు విజయవాడలో కండ్రిక కాలనీలో పెట్టిన మీటర్ ను తొలగించే వరకు ఉద్యమించారు. ఇంకా అనేక చోట్ల మీటర్లను ప్రజలు అడ్డుకుంటున్నారు.
ఎక్కడికక్కడ సిపిఎం, ఇతర ప్రజా సంఘాల కార్యకర్తల ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం… ప్రజాగ్రహాన్ని గమనించి ఇళ్ళకు స్మార్ట్ మీటర్లు బిగింపు నిలిపివేయాలి. ఆదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి, ఇప్పటికే షాపులకు, చిన్న పరిశ్రమలకు బిగించిన స్మార్ట్ మీటర్లను తొలగించాలి
లేనియెడల ప్రజా ఆందోళన తీవ్రమవుతుంది.
నేడు జరిగిన పాదయాత్రలో సిపిఎం నేతలు బి రమణరావు, ఝాన్సీ, వెంకటరెడ్డి, పీర్ సాహెబ్, సావిత్రి, పిచ్చమ్మ, సుందర్రామరాజు తదితరులు పాల్గొన్నారు.