ఎన్టీఆర్ జిల్లా తేదీ:13.03.2025
మొల్లమాంబ తెలుగు సాహిత్య సేవలు చిరస్మరణీయం
కవయిత్రి మొల్లమాంబ(మొల్ల) జీవితం ఆదర్శనీయం
జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
రామాయణాన్ని సంస్కృతము నుండి అందరికి అర్థమయ్యే రీతిలో తెలుగు భాషలోకి అనుమదించిన తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) అందించిన సాహిత్య సేవలు, చిరస్మరణీయంగా నిలిచిపోతాయని మొల్ల జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ అన్నారు.
తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతి సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవయిత్రి మొల్ల జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ ముఖ్య అతిదిగా హాజరై ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు రచయిత్రి కీర్తిశేషురాలు మొల్ల చిరుప్రాయంలోనే శ్రీరామ చరిత్రను వచన కావ్యంగా రచించారన్నారు. మొల్ల చురుకుదనం, ప్రజ్ఞను గమనించిన రాయలువారు ఆమెను సత్కరించి ప్రోత్సహించడం జరిగిందన్నారు. శ్రీకంఠేశ్వరుని దేవాలయం నందు ఐదు రోజుల పాటు రేయింబవళ్లు మల్లమ్మ పద్య రామాయణంను మూడు ప్రతులుగా పూర్తి చేయడం జరిగిందన్నారు. మొదటి రామాయణ ప్రతి హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చేరిందని అప్పటి విద్యా శాఖ మంత్రి ఆదేశాలతో ముద్రణ గావించి మొల్ల రామాయణంగా ప్రసిద్ధి పొందిందన్నారు. రెండవ ప్రతి తమిళనాడులోని తంజావూరు సరస్వతీ గ్రంధాలయం మూడవ ప్రతి కడప జిల్లా సి.పి. బ్రౌన్ గ్రంధాయానికి చేరాయన్నారు. తెలుగు సాహిత్య రంగానికి మొల్లమాంబ చేసిన సేవలు, తేట తెలుగు పద్య కావ్యం మొల్ల రామాయణం, ఆమె వర్ణనా మాధుర్యం తదితరాలను స్మరించుకున్నారు. చిన్న చిన్న పదాలతో గొప్ప అర్థం వచ్చేలా రచన చేసిన ఆమె సాహిత్య ఔన్నత్యం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ప్రభుత్వం మొల్లమాంబ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి యం లక్ష్మీ నరసింహం, కలెక్టరేట్ ఏవో ఎస్ శ్రీనివాసరెడ్డి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి. మహేశ్వరరావు, సహాయ బిసి సంక్షేమ అధికారి పి. శ్రీనివాసరావు, వసతి గృహ సంక్షేమ అధికారులు ఎ రజినీ కుమారి, బి. హేమ ప్రియా, కె.మోజస్, టి. ఆంజనీయులు, పర్యవేక్షకులు ఎస్. జయజ్వోతి, గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయ పర్యవేక్షకులు, సిహెచ్ గంగాధరం, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.