
మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓసీ అందజేత
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన
(లెటర్ ఆఫ్ క్రెడిట్) ఎల్ ఓసీ ను భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి
ప్రత్తిపాటి శ్రీధర్ తో కలిసి 40 వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పీవీ చిన సుబ్బయ్య, కూటమి నేతలు అందించారు..
40వ డివిజన్, బ్యాంకు సెంటర్ కు చెందిన పీ వెంకటరత్నం (65) హృద్రోగం తో బాధపడుతూ
ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది
తనకి మెరుగైన వైద్యం అందించాలని శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో
వైద్యం సాయం కొరకు దరఖాస్తు చేశారు.
మంజూరైన రూ 6 లక్షల 55 వేల
ఎల్ ఓ సీ ను బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.
త్వరితగతిన ఎల్ ఓసీ ను మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చల్లం రాజు ట్రస్ట్ డైరెక్టర్ పీ సూర్య దుర్గ, కూటమినేతలు నక్కిట్ల రాజా, గంగవరపు సురేష్, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు సప్పా శ్రీనివాస్, కొల్లి దుర్గారావు, తిరుపతి రెడ్డి, యలమంచిలి ఫణీంద్ర , జ్యోత్స్న ప్రియ తదితరులు పాల్గొన్నారు
![]()
