మెరుగైన వైద్యం కోసంఎల్. ఓ .సీ కూటమి నేతలతో కలిసి అందజేసిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శిప్రత్తిపాటి శ్రీధర్

2
0

మెరుగైన వైద్యం కోసం
ఎల్. ఓ .సీ అందజేత

కూటమి నేతలతో కలిసి అందజేసిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి
ప్రత్తిపాటి శ్రీధర్

ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన ఎల్.ఓ.సి లను
(లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాలను బుధవారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

43వ డివిజన్ ఏకలవ్య నగర్ కు చెందిన సందక రాజారావు హృద్రోగం , మూత్రపిండాల సమస్యలతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అతడికి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలుపగా స్థానిక నాయకులు ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం కోసం దరఖాస్తు చేశారు.
వారికి
రూ 5 లక్షల ఎల్.ఓ.సీ ను ఎన్డీఏ కూటమినేతల తో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు.

అదేవిధంగా 35 వ డివిజన్ కేదారేశ్వరపేట కు చెందిన
డీ విజయలక్ష్మి(68) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా
రూ 4 లక్షల ఎల్. ఓ. సీ ను అందజేశారు. త్వరితగతిన ఎల్.ఓ.సి మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితుడి కుటుంబ సభ్యులు
కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు కొప్పుల గంగాధర్, బొడ్డు నాగలక్ష్మి, బాయన హేరంభ కుమార్ కొంపెళ్ల శ్రీనివాసరావు డాక్టర్ హనుమంతరావు విశ్వేశ్వరరావు సుజనా మిత్రా కోఆర్డినేటర్లు సప్పా శ్రీనివాస్, కొల్లి దుర్గారావు, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here