మెరుగైన వైద్యం కోసం
ఎన్డీఏ కార్యాలయంలో
ఎల్. ఓ.సీ అందజేత
కూటమి నేతలతో కలిసి అందించిన
ఎమ్మెల్యే కార్యాలయ
కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన
ఎల్. ఓ. సీ.( లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో
పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు.
45 వ డివిజన్ రామ రాజ్య నగర్ కు చెందిన
బండి వనజాక్షి (71) హృద్రోగం తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తనకి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేశారు.
రూ 6 లక్షల ఎల్.ఓ.సీ మంజూరు కావడంతో బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.
త్వరితగతిన ఎల్.ఓ. సీ మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు
ఎన్డీఏ కూటమి నేతలు యేదుపాటి రామయ్య, పత్తి నాగేశ్వరరావు, పడాల గంగాధర్, బొల్లేపల్లి కోటేశ్వరరావు, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు సప్పా శ్రీనివాస్, కొల్లి దుర్గారావు, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు