ఎన్టీఆర్ జిల్లా, జూన్ 06, 2025 మెగా డీఎస్సీ.. తొలిరోజు ప్రశాంతం సెషన్-1లో 87.65 శాతం మంది అభ్యర్థుల హాజరు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పటిష్ట భద్రత నిరంతర పర్యవేక్షణతో సజావుగా పరీక్షల నిర్వహణ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*మెగా డీఎస్సీలో భాగంగా తొలిరోజు శుక్రవారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన సెషన్-1లో 1,150 మంది అభ్యర్థులకుగాను 1,008 (87.65 శాతం) మంది హాజరయ్యారు.జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ నగరంలోని పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (పీఎస్సీఎంఆర్)లోని పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ఇబ్బందిలేకుండా ప్రశాంత వాతావరణంలో అభ్యర్థులు పరీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ నెలరోజుల పాటు జరిగే మెగా డీఎస్సీ పరీక్షలు రాసేందుకు దాదాపు 30 వేల మందికి ఏర్పాట్లు చేశామని, జిల్లా పరిధిలోని పది పరీక్షా కేంద్రాలకు ప్రత్యేకంగా అధికారులను నియమించామని వెల్లడించారు. తాగునీటి సౌకర్యం, వైద్య శిబిరం, నీడ సౌకర్యం వంటివాటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) కావడంతో సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా ప్రత్యేక బృందాలతో డెస్క్టాప్, పవర్ బ్యాకప్ వంటివాటిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసు శాఖ భాగస్వామ్యంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకు చర్యలు తీసుకున్నామన్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండా ప్రణాళిక ప్రకారం చర్యలుతీసుకోవడం జరిగిందని.. తిరువూరు, మైలవరం వంటి ప్రాంతాలకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
Home Andhra Pradesh మెగా డీఎస్సీ.. తొలిరోజు ప్రశాంతం సెషన్-1లో 87.65 శాతం మంది అభ్యర్థుల హాజరు ఎక్కడా అవాంఛనీయ...