సుజనా చౌదరి ఔదార్యం
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పలివెల ప్రసాద్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.లంబాడి పేటకు చెందిన టిడిపి కార్యకర్త పలివెల ప్రసాద్ (54) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. నిరుపేద అయిన ప్రసాద్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని మాజీ కార్పొరేటర్ గుర్రంకొండ, 46 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు ధీటి ప్రభుదాస్ సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశాలు జారీచేశారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది బుధవారం వారి కుటుంబాన్ని పరామర్శించి సాయం అందించారు . హర్షద్, సురేష్, శివ, మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.
వించిపేటకు చెందిన తోట వసంతకుమారి అనారోగ్యంతో బాధపడుతూ ఎన్డీఏ కార్యాలయాన్ని సంప్రదించగా మందుల నిమిత్తం తోట వసంతకుమారికి కార్యాలయ సిబ్బంది ఆర్థిక సాయం అందించి భరోసానిచ్చారు. ఎమ్మెల్యే సుజనా కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.